పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. 2 ఏళ్ళ తర్వాత సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యారు. అసలు ఓ మహమ్మారి హడావిడి లేకపోతే ఈ పాటికే ‘వకీల్ సాబ్’ థియేటర్లలోకి రావడం.. ఫ్యాన్స్ చొక్కాలు చించేసుకుని రచ్చ చెయ్యడం జరిగిపోయేది. ఇదిలా ఉండగా.. పవన్ రీ ఎంట్రీకి ‘పింక్’ రీమేక్ సెలెక్ట్ చేసుకోవడం వెనుక పెద్ద కథే ఉందట.ముఖ్యంగా పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి త్రివిక్రమ్ హస్తం ఉందని తెలుస్తుంది. ఇప్పుడు పవన్ రాజకీయాల్లో ఉన్నారు.. ఆయన ఫ్యాన్స్ సినిమాలు చెయ్యాలి అని కోరుకుంటున్నారు.
కాబట్టి .. బాలీవుడ్ ‘పింక్’ రీమేక్ చేస్తే బెటర్ అని పవన్ కు సలహా ఇచ్చాడట.పవన్ రాజకీయ జీవితానికి పనికొచ్చే ఇలాంటి కథలు చేస్తే అటు అభిమానులు సంతోషిస్తారు..ఇటు పవన్ కూడా హ్యాపీగా ఉంటారు అని చెప్పాడట. ఇక ఇదే ప్రాజెక్ట్ ను ప్రొడ్యూస్ చెయ్యడానికి దిల్ రాజు కూడా అప్పటికి రెడీగా ఉన్నాడట. ఆ టైములో త్రివిక్రమ్ నే ఈ రీమేక్ ను తెరకెక్కించమని పవన్ కోరాడట. దాంతో దిల్ రాజుతో లాభాల్లో వాటా కావాలి అని త్రివిక్రమ్ చెప్పాడట. ఓ పక్క బోణి కపూర్ కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు..మళ్ళీ త్రివిక్రమ్ కు షేర్ ఇవ్వడం అవసరమా అని దిల్ రాజు భావించాడట.
ఇక ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో త్రివిక్రమ్ కూడా బిజీ అయ్యేసరికి వేణు శ్రీరామ్ తో స్క్రిప్ట్ వర్క్ చేయించి పవన్ తో ఓకే చేయించేసుకున్నాడట నిర్మాత దిల్ రాజు. ఇక ‘అల వైకుంఠపురములో’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో పడి త్రివిక్రమ్ కూడా ‘పింక్’ రీమేక్ సంగతి పూర్తిగా మర్చిపోయాడట. ఏమైనా నిర్మాతలలో దిల్ రాజు తెలివితేటలు అన్నీ ఇన్నీ కాదనే చెప్పాలి. అలా త్రివిక్రమ్ ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకున్నాడని తెలుస్తుంది.