Jeethu Joseph: ‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

ఇండియన్‌ సినిమా చరిత్రలో అందరు దర్శకులు ఒకవైపు.. జీతూ జోసెఫ్‌ ఒకవైపు. ఈ మాట కాస్త ఓవర్‌ హైప్‌లా కనిపించొచ్చు కానీ. ‘దృశ్యం’, ‘దృశ్యం 2 ’ సినిమాలు చూశాక, అందులో ఆయన స్క్రీన్‌ ప్లే, ట్విస్ట్‌లు చూశాక కచ్చితంగా ఈ మాట అంటారు. అందుకే దేశంలో ఇతర సినిమా పరిశ్రమలు తీసుకెళ్లి మరి ఆ కథను చూపిస్తున్నాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో మూడో సినిమా సిద్ధమవుతోంది. త్వరలోనే సినిమాను రిలీజ్‌ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఓ విషయం బయటకు వచ్చింది. అదే మూడో ‘దృశ్యం’లో ట్విస్ట్.

Jeethu Joseph

అదేంటి.. జీతూ జోసెఫ్‌ మైండ్‌ను లీక్‌ చేసేశారా? మూడో ‘దృశ్యం’ మెయిన్‌ సీన్‌ వచ్చేసిందా అనుకుంటున్నారా? అంత ఖలేజా ఎవరికీ ఉండదు కానీ.. ఓ వార్త అయితే సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా ముగింపు ట్విస్ట్‌ ఇదే అంటూ ఓ కథను అల్లేశారు. అది వింటుంటే ఆసక్తికరంగా ఉంది. ఏప్రిల్‌ 3న సినిమా విడుదలైనప్పుడు ఇదే సీన్‌ని మీరు చూస్తారు అంటూ అంచనాలు వేసేసి చెబుతున్నారు. తన కుటుంబానికి తెలియకుండా దాచి పెట్టిన ఒక విషయం మీద జార్జ్‌ కుట్టి/ రాంబాబు అంతర్మథమే మూడో ‘దృశ్యం’లో కీలక విషయమట.

రాంబాబు దాచిపెట్టిన సీక్రెటే ఈ సినిమాలో హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఆ సీన్స్‌ అటు ఇటు కదులుతూ ఈ సినిమా క్లైమాక్స్ చూసి ప్రేక్షకులు షాక్‌ అయ్యేలా ఉంటుంది అని చెబుతున్నారు. ‘దృశ్యం’ సినిమా కథలు, క్లైమాక్స్‌లు ఆశ్చర్యపరచడం కొత్త విషయమేమీ కాదు. అయితే రాంబాబు ఇప్పుడేం దాచాడు అనేది చూడాలి. అయితే ఆ ట్విస్ట్‌ మనకు ముందే తెలిసిపోతుంది. రాంబాబు పెద్దన్నయ్య అంటే అసలు వ్యక్తి జార్జ్‌ కుట్టి ముందే వచ్చేస్తాడు. ఆ తర్వాత రాంబాబు (తెలుగు), విజయ్‌ (హిందీ) వస్తారు.

 ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus