ఆగస్టు 11 న వస్తానంటున్న ఆ ముగ్గురు హీరోలు

  • April 3, 2017 / 01:51 PM IST

ఆగస్టు 11… ఈ డేట్ ప్రస్తుతం ఫిల్మ్ నగర్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే మొదటి కారణం జనతా గ్యారేజ్ తరవాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ అదే రోజు రిలీజ్ కాబోతోంది. బాబీ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న జై లవకుశ పై భారీ అంచనాలున్నాయి. ఇక రెండో కారణం.. కాటమరాయుడు తర్వాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ కూడా  ఆగస్టు 11…నే విడుదల చేయడానికి నిర్మాత రాధాకృష్ణ ఫిక్స్ అయ్యారు. నితిన్ డిఫరెంట్ లుక్ తో నటిస్తున్న చిత్రం లై. హనూ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్  ఉగాది కి రిలీజ్ అయి టాక్ ఆఫ్ ధీ టాలీవుడ్ అయింది.

ఈ సినిమాను ఆగస్టు 11నే విడుదల చేస్తున్నట్టు నితిన్ ప్రకటించాడు. దీంతో ఆ తేదీపై ముగ్గురి హీరోలకు మోజు ఎందుకనే ప్రశ్న తలెత్తినది. తీరా ఆరా తీయగా అసలు విషయం బయట పడింది.  ఆ రోజు సాధారణ శుక్రవారమే, కానీ ఆ తర్వాత శనివారం, ఆదివారం వీకెండ్. 14న కృష్ణాష్టమి, 15న స్వాతంత్ర్య దినోత్సవం. అంటే వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ ఐదురోజుల్లో సినిమా భారీ కలక్షన్స్ రాబట్టేందుకు ఆస్కారం ఉంది. సో ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని ముగ్గురు హీరోలు శ్రమిస్తున్నారు. మరి విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus