ముగ్గురులో ఎవరికి విజయం వరిస్తుంది ?

  • October 11, 2017 / 05:47 AM IST

వచ్చే ఏడాది ప్రధాన సీజన్ లో బరిలోకి దిగనున్న సినిమాల జాబితా సిద్ధమయిపోతోంది. సంక్రాంతికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ పోటీకి వస్తున్నట్లు ప్రకటించేశారు. వీటితో పాటు రెండు చిన్న సినిమాలు కూడా ముస్తాబవుతున్నాయి. అయితే 2018 సమ్మర్ లో కూడా భారీ ఫైట్ జరగనుంది. ఈ సీజన్‌లో ముగ్గురు స్టార్ హీరోలు పోటీపడనున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోల్జర్ గా నటిస్తున్న “నాపేరు సూర్య, నా ఇల్లు ఇండియా” సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించారు. రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

ఇక సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. ఈ మూవీని వేసవిలోనే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు. ఈ సంవత్సరం బాహుబలి కంక్లూజన్ ఏప్రిల్ 28 రిలీజ్ అయింది. అదే తేదీన వచ్చే ఏడాది సాహో రిలీజ్ చేయాలనీ నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు ప్రయత్నిస్తున్నారు. ఇక మహేశ్ బాబు, కొరటాల శివ వేసవిలో కలక్షన్ల వర్షం కురిపించాలని భావిస్తున్నారు. పొలిటికల్ పంచ్ లతో “భరత్ అనే నేను” సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూడు చిత్రాలలో ఏది పేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus