అభిమానులు సరే… రానా ఎందుకు అలా చేస్తున్నాడు..!

  • June 16, 2020 / 06:15 PM IST

ఇటీవల మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… మంత్రి సంతోష్ కుమార్ నిర్వహించిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ ను ముందుకు తీసుకెళ్ళడానికి శ్రీకారం చుట్టాడు.తన ఇంటి పరిధిలో మూడు మొక్కలు నాటాడు. తరువాత రాంచరణ్, రానా, శ్రద్దా కపూర్ లకు ఆ ఛాలెంజ్ ను విసిరాడు.అంతే కాకుండా తన ఫ్యాన్స్ ను కూడా ఈ మంచి పనిలో భాగస్థులు కావాలని కోరాడు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతను ఏమైనా ప్రమోట్ చేస్తే అది భారీ స్థాయిలో ప్రేక్షకుల్లోకి వెళుతుంది.

అయితే ఇక్కడ సీన్ రిపీట్ అయ్యింది. ప్రభాస్ ఛాలెంజ్ ను … తన అభిమానులు ఏమాత్రం స్వీకరించలేదు. బహుసా తన 20 వ చిత్రం ఫస్ట్ లుక్ ను అలాగే టైటిల్ ను విడుదల చెయ్యలేదు అని ఆగ్రహించి ప్రభాస్ మాటను లెక్కచెయ్యలేదేమో అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక తను నామినేట్ చేసిన రాంచరణ్, శ్రద్దా కపూర్, రానా వంటి సెలబ్రిటీలు కూడా ఏమాత్రం ఈ ఛాలెంజ్ ను యాక్సెప్ట్ చెయ్యలేదు.

చరణ్, శ్రద్దా బిజీగా ఉండి ఉండే అవకాశం ఉంది. కానీ ప్రభాస్ కు అత్యంత సన్నిహితుడు అయిన రానా ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు. ‘ఒక మొక్క నాటడానికి కూడా టైం లేదా..? లేక లైట్ తీసుకున్నాడా? అనే విషయం పై మాత్రం స్పష్టత లేదు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పై ఎటువంటి చర్చ జరగలేదు.

Most Recommended Video

కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus