కొరటాల ఇద్దరు హీరోయిన్ల కథేమిటో..?

  • October 17, 2016 / 01:55 PM IST

‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ ఎంట్రీ  ఇచ్చాడు కొరటాల శివ. ఇక రెండో చిత్రమైన ‘శ్రీమంతుడు’తో నిర్మాతలు శ్రీమంతులుగా మారడంతో పాటు శివ కీర్తిమంతుడయ్యాడు. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ సైతం మంచి కలెక్షన్లు రాబట్టింది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూడు సినిమాల్లోనూ సామాజికాంశం సహా మరో పోలిక కూడా కనబడుతుంది. అదే ఇద్దరు హీరోయిన్ల సెంటిమెంట్.

‘మిర్చి’లో అనుష్క, రిచా గంగోపాధ్యాయలను ప్రభాస్ కి జోడీగా నటింపజేసిన కొరటాల జనతా గ్యారేజ్ లో సమంత, నిత్యా మీనన్ లను తెరమీదికి తీసుకొచ్చాడు. దీనిపై పలు విమర్శలు కూడా వచ్చాయి. శ్రీమంతుడు సినిమాకి మాత్రం మహేష్ – శృతి హాసన్ కి ముడిపెట్టి ఒకే హీరోయిన్ తో పనికానిచ్చేసిన శివ మళ్ళీ ఇద్దరు హీరోయిన్ల కోసం వెతుకులాట మొదలెట్టాడట. శ్రీమంతుడు లాంటి హిట్ సినిమా తర్వాత మహేష్ – కొరటాల కలయికలో రానున్న సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉందట. ఈసారి కొరటాల ఏ ఇద్దరినీ దింపుతాడో మరి.. అయినా ఈ ఇద్దరు హీరోయిన్ల కథేమిటో..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus