Pawan Kalyan: పవన్‌ కొత్త సినిమా.. ఆలస్యానికి కారణమేంటి? అంతా ఓకే అనుకున్నా..

‘ఓజీ’ సినిమా తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఇక సినిమాలు చేయరు, ఇప్పటికే పూర్తయిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ఒక్కటే రానుంది అని అందరూ ఫిక్స్‌ అయిపోయారు. దానికి కారణం ఆయన చాలా ఏళ్ల క్రితం అనౌన్స్‌ అయిన సురేందర్‌ రెడ్డి – వక్కంతం వంశీ సినిమా ఇక లేనట్లే అనుకున్నారు. అనూహ్యంగా తమ బ్యానర్‌ ఎస్‌ఆర్‌టీని పక్కన పెట్టి జైత్ర రామ అనే బ్యానర్‌తో ఇదే సినిమాను మళ్లీ అనౌన్స్‌ చేశారు రామ్‌ తాళ్లూరి. అయితే ఆ తర్వాత ఈ సినిమా మీద ఇంకా ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఏమైందా అని చూస్తే.. ఓ విషయం బయటికొచ్చింది.

Pawan Kalyan

సోషల్‌ సెటైర్‌ కథతో తమ సినిమా తెరకెక్కబోతోంది అంటూ ఆ మధ్య కథా రచయిత వక్కంతం వంశీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌, ఆయన పొలిటికల్‌ ఇంట్రెస్ట్‌ కలగలిపి ఆ సినిమా ఉండబోతోంది అని వంశీ మాటలు బట్టి అర్థమవుతోంది. ఇదొక్కటే ఇప్పటివరకు ఆ సినిమా విషయంలో అప్‌డేట్‌. అయితే హీరోయిన్‌గా సాక్షి వైద్య ఫిక్స్‌ అయింది అనేది రూమర్‌. ఇందులో నిజం ఉంది అని సన్నిహిత వర్గాల సమాచారం.

హీరోయిన్‌ ఫిక్స్‌ అయిపోయింది, మిగిలిన టీమ్‌ అంతా రెడీ అయిపోయింది.. అయినా సినిమా ఎందుకు స్టార్ట్‌ అవ్వడం లేదు అనే ప్రశ్న గత కొన్ని రోజులుగా అభిమానులు, ప్రేక్షకుల్ని తొలిచేస్తోంది. దీనికి సమాధానం కథ అని తాజా సమాచారం. తొలుత అనుకున్న కథ విషయంలో పవన్‌ కల్యాణ్‌ అంత సంతృప్తిగా లేరని, అందుకే కొత్త కథ/ మార్పులు ఆలోచిస్తున్నారని సమాచారం. అంతా ఓకే అయితే వచ్చే నెలలో అధికారికంగా సినిమా మొదలుపెడతారు అని చెబుతున్నారు.

ఒక విధంగా పవన్‌ కల్యాణ్‌ నుండి రాబోయే ఆఖరు సినిమా ఇదే అని చెప్పొచ్చు. 2029 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2028లోనే ప్రచారం మొదలైపోతుంది. కాబట్టి ఈ ఏడాదిలో సినిమా మొదలైతే వచ్చే ఏడాది విడుదలవుతుంది. ఆ తర్వాత ఇంకో సినిమా చేసే పరిస్థితుల్లో పవన్‌ ఉంటారని చెప్పలేం.

‘దృశ్యం’లో దాచిన ఆ ఆఖరి విషయం ఏంటి? జీతూ జోసెఫ్‌ ఏం రాశారు?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus