నేల టికెట్ కథని రామ్ చరణ్ ఎందుకు వద్దన్నారు ?

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మాస్ మహారాజ రవితేజ చేస్తున్న “నేల టికెట్” సినిమా కథ ముందుగా రామ్ చరణ్ వద్దకు వెళ్లిందా ? .. అతను రిజెక్ట్ చేశారా? అంటే… అవుననే సమాధానం చెబుతున్నారు టాలీవుడ్ వర్గాల వారు. ఎస్‌ఆర్‌టీ మూవీస్‌ పతాకంపై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటోంది. సోగ్గాడే చిన్ని నాయన, రారండోయ్ వేడుక చూద్దాం విజయాల తర్వాత కళ్యాణ్ కృష్ణ రామ్ చరణ్ ని దృష్టిలో పెట్టుకొని ఓ కథ రాసుకున్నారు. అందుకు సన్నాఫ్ శంకర్ దాదా అనే పేరుని కూడా అనుకున్నారు. చరణ్ ని కలిసి కథని వినిపించారు.

మొదటి నుంచి చివరి వరకు ఎంతో సరదాగా సాగే ఈ కథ నచ్చినప్పటికీ చరణ్ వద్దన్నారు. తన తండ్రి సినిమాకి సీక్వెల్ తీయడం ఇష్టంలేక చరణ్ వద్దన్నట్టు సమాచారం. దీంతో డైరక్టర్ కథకి కొన్ని మార్పులు చేసి.. రవితేజకి వినిపించడం.. అతను ఒకే చెప్పడం.. సెట్స్ పైకి వెళ్లిపోవడం జరిగిపోయాయి. టైటిల్ కూడా సన్నాఫ్ శంకర్ దాదా నుంచి నేల టికెట్ గా మారింది. ఈ మూవీలో జగపతి బాబు రాజకీయనాయకుడి పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్ గా మాళవిక శర్మ నటిస్తోంది. మాస్ ప్రేక్షకులను అలరించే ఈ సినిమా మే లో థియేటర్లోకి రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus