ఎన్టీఆర్ పరువు ఇప్పుడు బాలయ్య చేతిలో ఉంది

  • April 25, 2020 / 08:15 PM IST

రియల్ మెన్ ఛాలెంజ్ ఏమో గాని సరికొత్త సంఘటనకు తెరలేపింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పనిమనుషులు కూడా లేని సమయంలో భార్య కోసం పనివాళ్ళం అవుదాం, వారికి ఇంటిపనులలో సాయం చేద్దాం అన్ని రియల్ మెన్ ఛాలెంజ్ పేరుతో ఓ కొత్త టాస్క్ మొదలుపెట్టారు. దానిని తరువాత నెరవేర్చి ముందుకు తీసుకెళ్లే బాధ్యత రాజమౌళికి ఇవ్వడంతో..ఏ పనినైనా శ్రద్దగా చేసే ఆయన పూర్తి చేయడమే కాకుండా, ఆ ఛాలెంజ్ తన ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, చరణ్ లకు విసిరిరారు.

ఇక్కడ వరకు బాగానే ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ టాస్క్ చిరు, వెంకీ, నాగ్ లతో పాటు తన బాబాయ్ బాలయ్యకు కూడా విసిరాడు. ఈ ఛాలెంజ్ విసిరి రెండు రోజులవుతున్నా బాబాయ్ బాలయ్య దగ్గర నుండి రెస్పాన్స్ లేదు. హుందాతనం మరియు వంశ గౌరవం వంటి విషయాలలో రాజసం ఫీలయ్యే బాలయ్య చీపురు పట్టడానికి ఇష్టపడడని అందుకే బాలయ్య ఈ టాస్క్ నెరవేర్చడం జరిగే పనికాదని కొందరు అంచనా వేస్తున్నారు.

ఇచ్చే టాస్క్ లో హుందాతనం గౌరవం ఉండాలి, ఇల్లు తుడవడం వంట వండడం వంటి టాస్క్ లు మా వంశంలో లేవని ఆయన ఫీలవుతున్నారనిపిస్తుంది. మరో వైపు ఎన్టీఆర్, బాలయ్యకు మనస్పర్థలు ఉన్నాయని టాలీవుడ్ లో ప్రచారం జరుగుతుండగా ఈ టాస్క్ ద్వారా అవి పుకార్లే అని నిరూపించాలని నందమూరి అభిమానులు సిద్ధంగా ఉన్నారు. మరో వైపు బాలయ్య ఈ టాస్క్ పూర్తి చేయకపోతే ఎన్టీఆర్ మాట పోవడంతో పాటు, కొంచెం ఆయన చిన్నబుచ్చుకొనే పరిస్థితి ఏర్పడుతుంది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus