బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ను అనౌన్స్ చేశారు. మరోసారి అక్కినేని నాగార్జుననే హోస్ట్గా పెడుతూ ప్రోమోలను రిలీజ్ చేశారు. ఇందులో ఈ సారి ప్రేక్షకులకు అవకాశం ఇస్తామని అనౌన్స్ చేశారు. ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని చెబుతూ ఓ వీడియో కూడా వచ్చింది. దీంతో చాలామంది కామన్ పీపుల్ దీని కోసం సిద్ధమవుతున్నారు. అయితే మరి నిజంగానే సాధారణ వ్యక్తులను బిగ్బాస్లోకి తీసుకుంటారా? అనే డౌట్ మొదలైంది. దీనికి కారణం గతంలో చేసిన పనే అని చెప్పొచ్చు.
బిగ్బాస్ తెలుగు చరిత్రలో కామన్ పీపుల్ని కంటెస్టెంట్లుగా తీసుకున్నది ఒకసారి మాత్రమే. అది కూడా రెండో సీజన్లో. నాని హోస్ట్గా వచ్చిన ఆ సీజన్లో ముగ్గురు కామన్ పీపుల్ని బిగ్బాస్ హౌస్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు మళ్లీ అదే పని చేస్తాం అని చెబుతున్నారు. అయితే ఈ సారి ఎంతమందిని తీసుకుంటాం అనేది మాత్రం చెప్పలేదు. ఒకవేళ చెప్పినా, తీసుకున్న వారు కామన్ పీపుల్ అవుతారా అనేదే ఇక్కడ ప్రశ్న? ఎందుకంటే రెండో సీజన్లో వచ్చిన వాళ్లు కామన్ పీపులే కానీ కాదు అని చెప్పాలి.
రెండో సీజన్ కామన్ పీపుల్గా బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టిన గణేశ్, నూతన్ నాయుడు, సంజన అన్నె.. అప్పటికే వివిధ రూపాల్లో సోషల్ మీడియాలో, ఇతర రంగాల్లో ఫేమస్. సంజన అన్నె నటిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్గా అప్పటికే నెటిజన్లకు పరిచయం. ఇక నూతన్ నాయుడు సోషల్ మీడియాలో, రాజకీయ రంగాల్లో, సేవా రంగాల్లో చాలామందికి పరిచయం. ఇక గణేశ్ ఒక్కడే కాస్త తక్కువ తెలుసు. అయితే రేడియో జాకీగా బాగానే పరిచయం ఉన్న వ్యక్తి.
అంటే కామన్ పీపుల్ కోటాలో నాన్ కామన్ పీపుల్ వచ్చారు అని అప్పట్లో వార్తలొచ్చాయి. విమర్శలూ వచ్చాయి. మరిప్పుడు మళ్లీ కామన్ పీపుల్ అంటున్నారు. మరి ఈసారి ఎవరిని తీసుకొస్తారు, వారు ఎంత వరకు కామన్ పీపుల్ అవుతారు అనేది చూడాలి. చూద్దాం ఈ సారి బిగ్ బాస్ ఎప్పటిలా కాకుండా కాస్త ఎర్లీగానే స్టార్ట్ చేస్తారట.