ఆ ఇద్దరి పేర్లు ఎన్టీఆర్ చెప్పాలంటున్న నెటిజన్లు!

Advertisement

ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడాలి ? ఆ ఇద్దరి పేర్లు ఏంటి? అని కొంతమందికి అయోమయంగా ఉండొచ్చు. కానీ జై లవకుశ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చూసిన వారికి మాత్రం అర్ధమవుతుంది. ఆరోజు తారక్ వేదికపై మాట్లాడుతూ… “‘బాబీ కథ చెప్పిన తర్వాత చాలా బాగుంది. త్వరలోనే కలుద్దాం అని వదిలేశాను. అయితే ఈ సినిమా చేయాలా..? వద్దా..? అని చాలా ఆలోచించాను. బాబీ కథ చెప్పి వెళ్లిపోయిన తర్వాత.. పేర్లు చెప్పను కానీ.. నా సన్నిహితులతో ఈ కథను షేర్ చేసుకున్నాను. ఈ చిత్రం సూపర్ హిట్ అయితే వాళ్లిద్దరి పేర్లు చెబుతాను. అప్పటి వరకు వాళ్ల పేర్లు చెప్పను” అని అన్నారు. సినిమా గురువారం రిలీజ్ అయింది. హిట్ టాక్ సొంతం చేసుకుంది. రెండు రోజుల్లో 60  కోట్లు వసూలు చేసి వీకెండ్ నాటికీ వంద కోట్ల క్లబ్ లో చేరడానికి పరుగులుతీస్తోంది.

జై లవకుశ హిట్ కావడంతో.. ఇప్పుడైనా ఆ ఇద్దరి స్నేహితుల పేర్లు బయట పెడుతారా ? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు అయితే ఎన్టీఆర్ నోరు విప్పాల్సిందేనని అడుగుతున్నారు. ఇలా దీనిపై చర్చ సాగుతోంది. ఆ ఇద్దరూ రాజమౌళి, నాగార్జున అని కొంతమంది గెస్ చేస్తున్నారు. మరికొందరు రాజమౌళి, కొరటాల శివ అని కామెంట్ చేస్తున్నారు. మరి ఎవరి గెస్ కరెక్టో తారక్ చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read