Maa Inti Bangaram 2: సీక్వెల్‌ ప్రకటించేసిన టీమ్‌.. సమంత వేయబోయే నెక్స్ట్‌ బిగ్‌ స్టెప్‌ అదేనా?

సమంత నుండి మూడేళ్ల క్రితం సినిమా రావడం వల్లనో, లేక సినిమా జోనర్ అలా ఉండటమో, లేక సినిమాలో సత్తా నచ్చిందో తెలియదు కానీ ‘మా ఇంటి బంగారం’ సినిమాను ప్రేక్షకులు తెగ చూసేస్తున్నారు. అందుకే సినిమాకు ఈ నెల 26 వరకు రూ.55 కోట్లు వరకు వసూళ్లు వచ్చాయి. హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాకు ప్రస్తుత రోజుల్లో ఈ స్థాయి వసూళ్లు అంటే పెద్ద విషయమే అని చెప్పాలి. ఈ స్థాయి వసూళ్లు వస్తున్నా సినిమాకు ఇంకా భారీ స్థాయిలో ప్రచారం చేస్తుండటం గమనార్హం.

Maa Inti Bangaram 2

ఆ విషయం పక్కన పెడితే.. ఈ సినిమాకు దక్కిన విజయాన్ని ఇంకాస్త క్యాష్‌ చేసుకోవడానికి సినిమా టీమ్‌ రెడీ అయిపోయింది. అందుకే ఈ సినిమాకు సీక్వెల్‌ని చిత్రబృందం అనౌన్స్‌ చేసింది. ఇటీవల విశాఖపట్నంలో సినిమా టీమ్‌ గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఆ వేదికపై సినిమా రచయిత, సమంత భర్త రాజ్ నిడిమోరు మాట్లాడుతూ మరో రెండేళ్లలో ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో సమంత ఫ్యాన్స్‌ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

అంతేకాదు ఇప్పటికే తన మైండ్‌లో ఈ సినిమా కోసం ఒక ఐడియా ఉందని, ఇదే టీమ్‌తోనే సీక్వెల్ ఉంటుందని రాజ్ క్లారిటీ ఇచ్చేశారు. ఒక సినిమాకు పార్ట్ 2 చేయాలనే ఇన్‌స్పిరేషన్ తనకు కలగడం ఇదే తొలిసారి అని చెప్పిన ఆయన.. రాబోయే సినిమా డబుల్ ఫన్, డబుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇక్కడ డౌట్‌ ఏంటంటే.. సమంత ఇప్పుడు మెటర్నిటీ లీవ్‌ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె గర్భవతి కాబట్టి కనీసంలో కనీసం 2027 జూన్‌ వరకు ఆమె సెట్స్‌లో తిరిగి అడుగు పెట్టే అవకాశం లేదు.

2028 జూన్‌ నాటికి సినిమా రావాలి అంటే చిత్రబృందం కథ, తదితర అంశాలను సిద్ధం చేసుకొని ఆమె సెట్స్‌లో అడుగు పెట్టేనాటికి రెడీగా ఉండాలి. బాలీవుడ్‌ హీరోయిన్లు కొంతమంది బిడ్డను కనిని రోజుల వ్యవధిలోనే షూటింగ్‌కి వచ్చేస్తుంటారు. మరి సమంత కూడా అదే పని చేస్తుందేమో చూడాలి.

200 భాషల్లో ‘వారణాసి’ .. ఫిబ్రవరి ఎండింగ్‌కి సినిమా రెడీ అవుతుందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus