Game Changer: చరణ్ – దిల్ రాజు.. కాంబోకే ఎందుకిలా..!

  • October 5, 2024 / 04:45 PM IST

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ‘గేమ్ ఛేంజర్’ రూపొందుతుంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా అంజలి నటిస్తుంది. ఎస్.జె.సూర్య, జయరాం, శ్రీకాంత్, సునీల్ వంటి పెద్ద తారాగణమే ఇందులో నటిస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. శంకర్ డైరెక్ట్ చేసే సినిమాలు దేశవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టిస్తూ ఉంటాయి. ఆయన సినిమాల్లోని పాటలు, యాక్షన్ బ్లాక్స్ అన్నీ హాలీవుడ్ సినిమాలను తలపిస్తూ ఉంటాయి.

Game Changer

ఇప్పటికే ‘గేమ్ ఛేంజర్’ నుండి రెండు పాటలు బయటకొచ్చాయి. మొదట వాటికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినా తర్వాత మంచి రెస్పాన్సే రాబట్టుకున్నాయి అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని మొదట డిసెంబర్ 20న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ ఆ టైంకి ‘పుష్ప’ ‘ముఫాసా’ వంటి పెద్ద సినిమాలు ఉండటంతో పోస్ట్ పోన్ కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. దిల్ రాజు – రాంచరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి చిత్రం ‘ఎవడు’ విషయంలో కూడా ఇలాంటి ఊహించని పరిణామాలే చోటు చేసుకున్నాయి.

‘గేమ్ ఛేంజర్’ కి బడ్జెట్ బాగా పెరిగిపోయింది. ‘ఎవడు’ విషయంలో కూడా అదే జరిగింది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఆ సినిమాకి బడ్జెట్ పెరిగిపోయింది. రిలీజ్ కూడా దాదాపు 6 నెలలు వాయిదా పడింది. దీంతో దిల్ రాజు ఎక్కువగా ఇంట్రెస్ట్..లు కట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడా ఆయన అదే చేస్తున్నారు.

ఇక ‘ఎవడు’ ని చివరాఖరికి డిసెంబర్లో రిలీజ్ చేయాలని దిల్ రాజు అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల.. అది కూడా కుదరక సంక్రాంతికి రిలీజ్ చేశారు. ‘గేమ్ ఛేంజర్’ విషయంలో కూడా సేమ్ సీన్, డిసెంబర్ అనుకున్నారు. ఇప్పుడు అది సంక్రాంతికి వెళ్లినట్టు టాక్. అదేంటో… చరణ్- దిల్ రాజు కాంబినేషన్లో రూపొందిన రెండు సినిమాలకి సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.

తొలి మూడు రోజుల్లో 300 కోట్లు.. తర్వాత మూడు రోజుల్లో అంత తక్కువా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus