Akhanda 2: బాలకృష్ణపై అంత పెడుతున్నారా.. చిన్న విషయం కాదుగా!

  • October 16, 2024 / 11:57 PM IST

నంద‌మూరి బాల‌కృష్ణ‌ (Nandamuri Balakrishna) – బోయపాటి శ్రీను (Boyapati Srinu) ..లది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. ‘సింహా’ ‘లెజెండ్’ ‘అఖండ’ (Akhanda) వంటి బ్లాక్ బస్టర్స్ ఈ కాంబో నుండి వచ్చాయి. బాల‌య్య‌ని అభిమానులు ఎలా చూడాలని కోరుకుంటారో.. అలా చూపించగల టాలెంట్ దర్శకుడు బోయపాటి శ్రీనుకి ఉంది. ఇక వీరిద్దరి కలయికలో 4 వ సినిమా రాబోతున్నట్లు చాలా కాలం నుండి ప్రచారం జరిగింది. వీరి కాంబినేషన్లో రూపొందనున్న 4వ సినిమా ‘అఖండ 2’ (Akhanda 2) అని ఈ మధ్యనే క్లారిటీ ఇచ్చారు.

Akhanda 2

అలాగే ఈరోజు ‘అఖండ 2’ (Akhanda 2) గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది. ‘అఖండ 2 ‘ టైటిల్ అయితే ‘తాండ‌వం’ అనేది క్యాప్షన్ గా పెట్టారు. టైటిల్ ప్రోమో కూడా వదిలారు. ఇక ఈ చిత్రాన్ని ’14 రీల్స్’ సంస్థపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించబోతున్నారు. అయితే ‘అఖండ’ చిత్రాన్ని ‘ద్వారకా క్రియేషన్స్’ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. కానీ పార్ట్ 2 కి నిర్మాత మారడం హాట్ టాపిక్ అయ్యింది.

‘పెదకాపు-1’ సినిమా ప్రమోషన్స్ టైంలో కూడా ‘అఖండ 2′ (Akhanda 2) ప్రాజెక్టు తమ బ్యానర్లో ఉంటుందని రవీందర్ రెడ్డి చెప్పుకొచ్చాడు. మరి ఏమైందో ఏమో తెలీదు కానీ.. ఇప్పుడు ఈ ప్రాజెక్టు ’14 రీల్స్ ప్లస్’ వారికి వెళ్ళింది. ఇదిలా ఉండగా.. ‘అఖండ 2’ కోసం నిర్మాతలు ఏకంగా రూ.125 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్టు సమాచారం. అలా చూసుకుంటే బాలయ్య కెరీర్లో ఇది హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి.. రూ.125 కాస్త .. రూ.150 వరకు కూడా పెరిగే అవకాశం ఉంది.

‘గుంటూరు కారం’ రిజల్ట్‌.. మొదటిసారి స్పందించిన నిర్మాత.. ఏమన్నారంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus