Nayanthara: ‘యోగి’ సినిమా వల్లే నయనతార ప్రమోషన్స్ కి దూరమయ్యిందట.. ఏమైందంటే..!

  • September 13, 2023 / 08:11 PM IST

నయనతార.. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా తమిళంలో ఈమె సూపర్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఒక్కో సినిమాకి ఏకంగా రూ.8 కోట్ల నుండి రూ.10 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటూ ఈమె నెంబర్ వన్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇటీవల షారుఖ్ ఖాన్- అట్లీ కాంబినేషన్లో వచ్చిన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్లో కూడా అదరగొట్టింది ఈ బ్యూటీ.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. నయనతార విషయంలో దర్శకనిర్మాతల సైడ్ నుండి ఎప్పుడూ ఓ కంప్లైంట్ ఉంటుంది. ఆమె తన సినిమాల ప్రమోషన్లకు హాజరు కాదు అనేది ఆ కంప్లైంట్. అయితే ‘జవాన్’ సినిమా కోసం ఈమె బాలీవుడ్లో చేసిన ప్రమోషన్స్ కు హాజరైంది. అక్కడ పలు పేపర్స్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిందట. ముఖ్యంగా సినిమా ప్రమోషన్స్ కి ఆమె హాజరు కాకపోవడానికి గల బలమైన కారణాన్ని ఆమె ఈ సందర్భంగా చెప్పుకొచ్చిందట.

ప్రభాస్ ‘యోగి’ సినిమా ఆడియో వేడుకలో ఓ రాజకీయ నాయకుడు (Nayanthara) నయనతారని Laigiకంగా వేధించాడట.ఆ టైంలో ఆమె ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉండిపోయినట్లు కూడా చెప్పుకొచ్చిందట. ఏదైనా సినిమా ప్రమోషన్స్ కి వస్తే.. ఆ సంఘటనే గుర్తుకొస్తుంది.. అందుకే సాధ్యమైనంత వరకు ప్రమోషన్స్ కి దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె తెలియజేసింది. అయితే ‘కర్తవ్యం’ సినిమా కోసం ఆమె ప్రమోషన్స్ కి వెళ్లిందని కూడా గుర్తుచేసిందట.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus