‘రక్త చరిత్ర’ నటుడు కన్నుమూత

  • August 9, 2021 / 06:32 PM IST

బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిడ్నీ ఇన్ఫెక్షన్ కారణంగా ఇటీవల ముంబైలోని సిటీ ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటుడు అనుపమ్ శ్యామ్(63) సోమవారం మరణించినట్లు అతని సన్నిహితుడు, నటుడు యశ్‌పాల్ శర్మ తెలిపారు. ఈ నటుడు ప్రముఖ బాలీవుడ్ సినిమాల్లోనే కాకుండా “మన్ కీ ఆవాజ్: ప్రతిజ్ఞ” అనే టీవీ షోతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్నాడు. రక్త చరిత్ర, సత్య, స్లమ్‌డాగ్ మిలియనీర్, బందిపోటు, లగాన్, , క్వీన్ వంటి ట్రెండ్ సెట్టర్ సినిమాల్లో కూడా పాత్రల్లో కనిపించారు.

ఎలాంటి సినిమా చేసినా కూడా తన పాత్ర హైలెట్ అయ్యేలా యాక్టింగ్ తో ప్రేక్షకుల మనసులును టచ్ చేస్తుంటారు. అలాంటి ప్రముఖ నటుడు మరణించాడనే వార్త వినగానే బాలీవుడ్ ఇండస్ట్రీ లో సినీ ప్రముఖులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అనుపమ్ శ్యామ్ సబర్బన్ రీసెంట్ గా గోరేగావ్‌లోని లైఫ్‌లైన్ ఆసుపత్రిలో చేరారు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలోనే ఆయన చికిత్స కోసం ఎంతగానో పాటు పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉండడంతో కొంతమంది సినీ ప్రముఖుల నుంచి కూడా సహాయం అందుకున్నారు.

సోమవరంనాడు ఉదయం అతని నివాసం న్యూ దిండోషి, MHADA కాలనీకి తీసుకువచ్చి వెంటనర్ అంత్యక్రియలు త్వరగానే పూర్తి చేసినట్లు కూడా శ్రీ శర్మ నేషనల్ మీడియాకు వివరణ ఇచ్చారు. దాదాపు మూడు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తన స్థాయిని అంతకంతకు పెంచుకుంటూ వచ్చారు. ఇటీవల తన “మన్ కీ ఆవాజ్: ప్రతిజ్ఞ” షో యొక్క రెండవ సీజన్ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాడు. ఇక ఇంతలోనే ఆయన ప్రాణాలు విడువడం అందరిని షాక్ కు గురి చేసింది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus