కరోనా భారిన పడ్డ మరో సినీ సెలబ్రిటీ..!

Advertisement

ఇప్పుడు కరోనా దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. సామాన్య ప్రజల దగ్గర నుండీ సెలబ్రిటీల వరకూ అందరూ దీని దృష్టిలో సమానమే..! ఇప్పటికే ఇండియాలో 11 లక్షల కేసులు నమోదయ్యాయి. సినిమా సెలబ్రిటీలు కూడా దీని భారిన పడుతున్నారు. ఇప్పటికే బుల్లితెర ప్రభాకర్, ‘బిగ్ బాస్3’ ఫేం రవికృష్ణ, నిర్మాత బండ్ల గణేష్ వంటి వారు కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ లో అయితే అమితాబ్ బచ్చన్ కుటుంబం కూడా కరోనా భారిన పడింది. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ ల దంపతులతో పాటు వారి పాప ఆరాధ్యకు కూడా కరోనా సోకింది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు అర్జున్ కూతురుకి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో కోలీవుడ్ మొత్తం టెన్షన్ కు గురయ్యింది. వివరాల్లోకి వెళితే.. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు అయిన ఐశ్వర్య అర్జున్… గత రెండు మూడు రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న తరుణంలో తాజాగా కరోనా టెస్టులు చేయించారట.

ఈ టెస్టుల్లో ఆమెకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం చెన్నైలో ఆమె ఇంట్లోనే ఐశ్వర్య చికిత్స పొందుతున్నట్టు.. సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ మధ్య కాలంలో కలిసిన తన స్నేహితులను కూడా కరీనా పరీక్షించుకోవాలని ఆమె కోరింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus