మలయాళ చిత్రసీమలో స్టార్ హీరోగా ఎదిగిన ఉన్ని ముకుందన్ పేరు పరిచయాలు అవసరం లేని స్థాయికి చేరుకుంది. ఇప్పటికే ఎన్నో మలయాళ సినిమాలతో పాటు తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యిన ఈ యాక్షన్ హీరో ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు. తన సొంత మేనేజర్ అయిన విపిన్ కుమార్పై దాడి చేయించినట్లు ఆరోపణల నేపథ్యంలో ఉన్ని ముకుందన్పై (Unni Mukundan) పోలీస్ కేసు నమోదు కావడం మాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఈ హీరో మలయాళంనే కాకుండా తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించాడు.
తెలుగులో బాగమతి(Bhaagamathie), జనతా గ్యారేజ్ (Janatha Garage) , యశోద (Yashoda) సినిమాల్లో నటించారు. ఇక ముఖ్యంగా ఇటీవల వచ్చిన మార్కో ఏకంగా 100 కోట్లు రాబట్టింది. ఇక ఎంతో కాలంగా తన వద్ద పని చేస్తున్న మేనేజర్ పై దాడి చెయ్యడంతో అతనిపై పోలీస్ కేసు నమోదయ్యింది. అలాగే మేనేజర్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. టోవినో థామస్ (Tovino Thomas) నరివెట్ట డినిమాపై పాజిటివ్ రివ్యూస్ షేర్ చేసినందుకు ఉన్నిముకుందన్ తన మేనేజర్ విపిన్ ని కొట్టినట్లు తెలుస్తోంది.
ఇక అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు గురించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఇక హీరో వైపు నుంచి ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. ఉన్ని ముకుందన్ (Unni Mukundan) గానీ, అతని పీఆర్ టీమ్ గానీ ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే ఈ ఆరోపణలు నిజమా? లేదా తప్పుబడిన భావోద్వేగపు ప్రతిస్పందనా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో కూడా ఉన్ని ముకుందన్ తన దురుసు ప్రవర్తన తో సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొన్నారు.
ఇక ఈ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇస్తారో చూడాలి. ఇక, ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ (Marco) చిత్రం మలయాళంలో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులోనూ ఈ సినిమాను డబ్ చేసి విడుదల చేశారు. అయితే అక్కడి హిట్తో పోలిస్తే తెలుగు వెర్షన్కు అంతగా ఆదరణ లభించలేదు. ఓటీటీలో విడుదలైన తరువాత సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ ‘మార్కో’ మలయాళంలో 100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టిన తొలి ‘ఏ’ సర్టిఫికేట్ సినిమా కావడం విశేషం.