Actress : సౌకర్యాలు కల్పించలేదు అంటూ ప్రొడక్షన్‌ హౌస్‌ మీద స్టార్‌ హీరోయిన్‌ ఫైర్‌!

  • July 3, 2023 / 08:09 PM IST

సినిమా షూటింగ్‌ ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో పెట్టి.. షూటింగ్‌ అయ్యాక ఆ హీరోయిన్‌ను, టీమ్‌ను వదిలేసి ఓ నిర్మాణ సంస్థ వచ్చేసింది అంటే నమ్ముతారా? ఈ మాట నమ్మడం కష్టమే కానీ.. నమ్మక తప్పని పరిస్థితి. ఇది ఎక్కడో కాదు, మన బాలీవుడ్‌లోనే జరిగింది. అది కూడా మనకు బాగా తెలిసిన హీరోయిన్‌కే జరిగింది. అంతేకాదు ఈ విషయం ఇప్పుడు బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. ఆ హీరోయిన్‌ అమీషా పటేల్‌ కాగా, ఆ సినిమా ‘గదర్‌ 2’. ఇంతకీ ఏమైందంటే?

సన్నీ డియోల్‌, అమీషా పటేల్‌ (Actress) ప్రధాన పాత్రల్లో 22 ఏళ్ల క్రితం ‘గదర్‌’ అని ఓ సినిమా వచ్చింది. ఆ వైవిధ్యమైన ప్రేమ కథకు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. అయితే ఇప్పుడు ఇన్నాళ్లకు ‘గదర్‌ 2’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను అనిల్‌ శర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది. ఆ నిర్మాణ సంస్థ పైనే ఇప్పుడు అమీషా పటేల్‌ విమర్శలు చేశారు. ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వలేదని, షూటింగ్‌ స్పాట్‌లో వదిలేశారని ఘాటు విమర్శలు చేశారు అమీషా పటేల్‌.

ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లు చేశారు. మేలో చండీగఢ్‌లో ‘గదర్‌ 2’ సినిమా చివరి షెడ్యూల్‌ షూటింగ్‌ చేశాం. అప్పుడు చిత్రీకరణలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాం. మేకప్‌ ఆర్టిస్ట్స్‌, కాస్ట్యూమ్స్‌ డిజైనర్స్‌ ఇలా చాలా విభాగాల వారికి అనిల్ శర్మ ప్రొడక్షన్స్‌ పారితోషికం ఇవ్వలేదు. ఆఖరికి భోజనం, వసతి, ట్రావెలింగ్‌ లాంటి కనీస అవసరాలకు బిల్లులు కూడా చెల్లించలేదు. షూటింగ్ ముగిసిన రోజు చండీగఢ్‌ విమానాశ్రయానికి వెళ్లడానికి ప్రయాణ ఏర్పాట్లూ ఇవ్వలేదు.

మమ్మల్ని వదిలేసి నిర్మాణ సంస్థ వారు వెళ్లిపోయారు అని అమీషా ఘాటు విమర్శలు చేసింది. అయితే ఆ సమయంలో జీ స్టూడియోస్‌ టీమ్‌ వచ్చి తమకు సాయం చేశారని అమీషా పటేల్‌ ఆ ట్వీట్స్‌లో పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆమె కామెంట్స్‌ వైరల్‌గా మారాయి. మరి దీనికి నిర్మాణ సంస్థ ఏం సమాధానం చెబుతుందో చూడాలి.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus