ఇప్పుడు కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తుంది. రోజు రోజుకి కేసులు పెరుగుతూనే ఉంటున్నాయి. డిశ్చార్జ్ రేటు కూడా పెరుగుతుంది అని చెబుతున్నారు. కానీ వాటిలో నిజం లేదు అన్న ప్రచారం కూడా జరుగుతుంది. హాస్పిటల్ లో బెడ్స్ ఖాళీ లేకపోవడం.. వైద్య సిబ్బంది లేకపోవడం వల్ల కూడా.. కావాలనే ‘పూర్తిగా కోలుకోని వారిని సెల్ఫ్ క్వారెంటైన్లో ఉండాలంటూ చెప్పి డిశ్చార్జ్ చేసేస్తున్నారు’ అనే ఆరోపణలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అది పక్కన పెడితే.. సామాన్య నటులకు మాత్రమే సెలబ్రిటీలకు కూడా ఇదే పరిస్థితి ఉందంటూ ఓ టీవీ నటి తెలపడం సంచలనంగా మారింది. ‘తనకు కరోనా లక్షణాలు ఉన్నాయని చెప్పినా.. ప్రముఖ హాస్పిటల్ సిబ్బంది’ పట్టించుకోవడం లేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
ఆ టీవీ నటి మరెవరో కాదు ‘కసౌటీ జిందగీ కే’ ఫేమ్ చార్వీ సరాఫ్. ఇటీవల ఓ లేఖ ద్వారా ఆమె ఈ విషయాన్ని తెలియజేసింది.’నాలో కరోనా లక్షణాలు ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఢిల్లీలో టెస్టులు చేయించుకోవడం ఎంత కష్టంతో కూడుకున్న పనో తెలుసా? లాక్ డౌన్ విధించినప్పటి నుండీ నా స్వస్థలం అయిన ఢిల్లీలోనే ఉన్నాను. అందరిలాగే మా కుటుంబం కూడా ఇంటికే పరిమితమైంది. నిత్యావసరాలకు తప్ప బయటకు వెళ్ళడం లేదు. కరోనాతో కలిసి జీవించడానికి సిద్దపడుతున్నాం. అయితే గతవారం రోజులుగా నా ఆరోగ్యం బాగుండటం లేదు. జ్వరం వచ్చింది. గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్లు నొప్పులతో పాటు శ్వాస తీసుకోవడం కూడా ఇబ్బందిగా మారింది.
అప్పటి నుండీ మా ఫ్యామిలీ డాక్టర్లు, ప్రైవేటు డాక్టర్లు ప్రభుత్వ ఆస్పత్రులకు ఫోన్ చేస్తూనే ఉన్నారు.అయితే ప్రభుత్వ ఆసుపత్రి వాళ్ళు ఒకే మాట చెబుతున్నారు… ‘తగినన్ని కిట్లు అందుబాటులో లేవని’.! ఆ మాటలు వినీ వినీ నాకు విసుగొచ్చింది. డైలీ న్యూస్ చూసి ఏమో అనుకున్నా గానీ.. అవన్నీ నిజమే. ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో అంతుపట్టడం లేదు. నేను స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నాను. నా పరిస్థితే ఇలా ఉందంటే.. ఏ ఆధారం లేని వాళ్లు… ఈ కష్టకాలాన్ని ఆ మహమ్మారిని ఎలా ఎదుర్కొంటున్నారో’’అంటూ చార్వీ తన ఆవేదన వ్యక్తం చేసింది.
1
2
3
4
5
6
7
8
9
10
11
Most Recommended Video
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!