నేను కూడా డిప్రెషన్ కు లోనయ్యాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన మెహ్రీన్..!

  • September 21, 2020 / 10:32 PM IST

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు దర్యాప్తులో ఉన్న సంగతి తెలిసిందే. అది రోజుకొక మలుపు తిరుగుతున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అయితే ప్రధానంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కు లోనవ్వడం వల్లనే.. అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినట్టు చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సౌత్లో ఉన్న సినీ సెలబ్రిటీలు అందరూ డిప్రెషన్ అనే అంశం పై స్పందించారు. తాజాగా హీరోయిన్ మెహ్రీన్ కూడా ఈ విషయం పై స్పందించింది.

అంతేకాదు ఆమె కూడా డిప్రెషన్ కు లోనయ్యాను అంటూ షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. ఆమె మాట్లాడుతూ.. “జీవితంలో ప్రతీ ఒక్కరు కొన్ని సందర్భాల వల్ల డిప్రెషన్ కు లోనవుతుంటారు. నేను కూడా డిప్రెషన్ కు లోనయ్యాను. అయితే దాని నుండీ ఎంత త్వరగా బయటపడ్డామన్నదే చాలా ముఖ్యం.దానికి ముందు చెయ్యాల్సిన పనులు ..ముందుగా మనల్ని మనం నమ్మాలి, అలాగే దేవుడ్ని కూడా నమ్మాలి.అందరికీ జీవితం ఒక్కటే..! అది చాలా అందమైనదని గుర్తుంచుకోవాలి.

ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపాలి.ఇవి పాటిస్తేనే డిప్రెషన్ నుండీ త్వరగా బయటపడగలము. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ లో మానవ జాతి మొత్తం డిప్రెషన్ ను ఫేస్ చేస్తుందన్న నిజాన్ని కూడా అందరూ గుర్తించాలి” అంటూ చెప్పుకొచ్చింది మెహ్రీన్. ప్రస్తుతం ఈమె ‘ఎఫ్3’ చిత్రంలో నటిస్తున్న సంగతి కూడా తెలియజేసింది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus