శ్యామ్ కె నాయుడు పై కేసు పెట్టడానికి కారణం అదే : సాయి సుధా

  • May 28, 2020 / 04:51 PM IST

ప్రముఖ సినిమాటోగ్రఫర్ శ్యామ్.కె.నాయిడు పై ‘అర్జున్ రెడ్డి’ నటి సాయి సుధా నిన్న ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో శ్యామ్.కె.నాయుడు ని పోలీసులు అరెస్ట్ చేసారు. ఈయన ప్రముఖ స్టార్ సినిమాటోగ్రఫర్ చోటా.కె.నాయుడు తమ్ముడు. హీరో సందీప్ కిషన్ కు ఇతను స్వయానా మేనమామ అన్న సంగతి తెలిసిందే. ‘పోకిరి’ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ ‘బిజినెస్ మెన్’ వంటి ఎన్నో హిట్ చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించాడు. ఇక సాయి సుధా ను చాలా కాలం నుండీ ప్రేమించి.. పెళ్ళి చేసుకుంటాను అని మాటిచ్చి..

ఇప్పుడు మోసం చేసాడు అంటూ శ్యామ్ కె నాయుడు పై కంప్లైంట్ ఇచ్చింది సాయి సుధా. ఇక ఈ విషయం పై సుధా మాట్లాడుతూ.. “గత ఐదేళ్ళుగా మేము ఇద్దరం రిలేషన్ లో ఉన్నాము. నా దగ్గరకి రావడమే ఆయన ప్రపోజ్ చేసాడు..నేను కూడా యాక్సెప్ట్ చేశాను. మా రిలేషన్ షిప్ గురించి శ్యామ్ కె నాయుడు ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు. శ్యామ్ కె నాయుడు అన్నయ్య… చోటా కె నాయుడు గారికి కూడా తెలుసు.

‘నిన్ను పెళ్ళిచేస్కుంటాను అన్నాడు’ అని శ్యామ్ అడగగానే…. ‘మీకు ఇది వరకే పెళ్ళైంది కదా?.. అని నేను ప్రశ్నించాను? దానికి ఆయన ..’నా కుటుంబంలో కలహాలున్నాయని, కాబట్టి నీతోనే ఉంటాను’ అని ఆయన అన్నారు.కానీ ఇప్పుడు పెళ్ళిచేసుకోమని ఎంతగా అడిగినా రెస్పాన్స్ లేదు.దీంతో కేస్ ఫైల్ చేస్తున్నా అని శ్యామ్.కె.నాయుడుకి అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కు మెసేజ్ చేసినా రెస్పాన్స్ ఇవ్వలేదు. దాంతో ఈ స్టెప్ తీసుకోక తప్పలేదు” అంటూ చెప్పుకొచ్చింది సాయి సుధా.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus