ప్రముఖ నిర్మాత పై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!

  • November 27, 2020 / 01:32 PM IST

‘మీటూ’.. దీని గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదనుకుంట.బాలీవుడ్ హీరోయిన్ తను శ్రీ దత్తా నెలకొల్పిన ఈ ఉద్యమం దేశమంతా పాకింది. ఎంతో మంది నటీమణులు, వివిధ రంగాల్లో పనిచేసే మహిళలు, అలాగే సినీ రంగానికి చెందిన మహిళలు తాము ఎదుర్కొన్న లైంగిక దాడుల గురించి మీడియా లేదా సోషల్ మీడియా వేదికగా బయటపెట్టారు.టాలీవుడ్లో కూడా పాపులర్ సింగర్స్ మరియు కొంతమంది ఫేడౌట్ అయిపోయిన నటీమణులు మీడియా ముందుకు వచ్చి వారికి జరిగిన అన్యాయాన్ని చెప్పుకొచ్చారు.

గతేడాది ఆరంభం నుండీ ఇటువంటి ఆరోపణలు తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ పలువురు నటీమణులు ‘మీటూ’ పై స్పందిస్తూనే ఉన్నారు. అయితే వాళ్ళని వేధించిన సినీ సెలబ్రిటీలు ఎవరు అనే విషయాన్ని మాత్రం వారు చెప్పరు. దాంతో రెండు, మూడు రోజులు ట్రేండింగ్ లో ఉంటున్నారు తప్ప.. తరువాత వారిని జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే… ఇప్పుడు కూడా ఓ హీరోయిన్ తనను ఓ నిర్మాత వేధిస్తున్నాడు అంటూ ఆరోపణలు చెయ్యడం సంచలనంగా మారింది.

ఆమె మరెవరో కాదు.. ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయమైన వాణి భోజన్. ఈమెను కూడా ఓ నిర్మాత పడుకుంటే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తాను అని చెప్పాడట. అందుకు ఈమె ఒప్పుకోకపోవడంతో సినిమా నుండీ తప్పించాడని.. దాంతో చాలా మనస్తాపానికి గురయ్యానని తెలిపింది. అయితే అందరిలాగే ఈమె కూడా ఆ నిర్మాత ఎవరు అన్న విషయాలు బయటపెట్టలేదు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus