ఆదిపురుష్ తో బాహుబలి రికార్డులకు గండం..!

  • August 24, 2020 / 04:00 PM IST

ప్రభాస్ ఆదిపురుష్ ప్రకటన సంచలనం రేపింది. ఆదిపురుష్ ప్రకటనతో ప్రభాస్ దేశంలోనే టాప్ స్టార్ గా మారాడన్న విషయం అర్థం అయ్యింది. దేశం మొత్తం మార్కెట్ ఉన్న ప్రభాస్ ద్వారా మాత్రమే వందల కోట్ల బుడ్జెట్ మూవీలు సాధ్యం అని బాలీవుడ్ కూడా భావిస్తుంది. అందుకే బాలీవుడ్ స్టార్స్ ని కూడా కాదని దర్శకుడు ఓం రౌత్ మరియు నిర్మాత భూషణ్ కుమార్ ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ ని ఎంపిక చేశారు.

రామాయణ గాథగా ఈ చిత్రం తెరకెక్కనుండగా ప్రభాస్ రాముడిగా కనిపించడం విశేషం. 400 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రం బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అంటున్నారు. ఆదిపురుష్ మూవీ ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా ఉన్న బాహుబలి రికార్డులు చెరిపివేస్తుందని అందరూ గట్టిగా నమ్ముతున్నారు. దర్శకుడు ఓం రౌత్ ఈ పౌరాణిక గాథను విజువల్ వండర్ గా తెరకెక్కించనున్నారు. అలాగే విదేశీ నిపుణులను ఈ చిత్రం కోసం తీసుకోనున్నారట.

హాలీవుడ్ బడా చిత్రాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు గ్రాఫిక్ వర్క్ చేయనున్నారు. చాలా గ్రాండ్ గా తెరకెక్క నున్న ఈ మూవీ బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేసే ఫీట్ సాధిస్తుందని గట్టిగా నమ్ముతున్నారు. వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రం 2022లో విడుదల కానుందని సమాచారం.

Most Recommended Video

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
IMDB రేటింగ్స్ ప్రకారం టాప్ 25 టాలీవుడ్ మూవీస్ ఇవే…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus