Adivi Sesh: ఈ హీరోను ఆఫీస్ బాయ్స్ అలా చూశారా?

  • July 7, 2021 / 01:58 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతిభతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వారిలో అడివి శేష్ ఒకరని చెప్పవచ్చు. అడివి శేష్ నటించిన సినిమాలలో ఫ్లాప్ అయిన సినిమాల కంటే సక్సెస్ సాధించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. క్షణం సినిమా అడివి శేష్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. సినిమాసినిమాకు మార్కెట్ ను పెంచుకుంటూ మినిమం గ్యారంటీ హీరోగా అడివి శేష్ పేరు సంపాదించుకున్నారు. లో బడ్జెట్ లో క్షణం సినిమా తెరకెక్కినప్పటికీ నిర్మాతకు మాత్రం భారీ లాభాలను అందించింది.

పీవీపీ సంస్థ ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. అడివి శేష్ ఒక సందర్భంలో మాట్లాడుతూ క్షణం సినిమా షూటింగ్ సమయంలో పీవీపీ బ్యానర్ లో బ్రహ్మొత్సవం, ఊపిరి సినిమాలు తెరకెక్కుతున్నాయని ఆ సంస్థలోని ఆఫీస్ బాయ్స్ తనను వీడికి కూడా టీ అందించాలా..? అనేలా చూశారని అడివి శేష్ చెప్పుకొచ్చారు. అడివి శేష్ తనకు జరిగిన అవమానాన్ని తరుణ్ భాస్కర్ షోలో వెల్లడించారు. ప్రస్తుతం అడివి శేష్ మేజర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా హిందీ శాటిలైట్,

డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. శేష్ ఈ సినిమాతో గ్యారంటీగా మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారని అతని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడుల్లో మృతి చెందిన ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అడివి శేష్ కు జోడీగా శోభితా ధూళిపాళ్ల ఈ మూవీలో నటిస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus