కార్తి సినిమా రీమేక్ లో అజయ్ దేవగన్!

  • January 13, 2022 / 07:14 PM IST

సౌత్ లో హిట్ అయిన చాలా సినిమాలను నార్త్ లో రీమేక్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సౌత్ లో విడుదలయ్యే ప్రతి సినిమాపై ఉత్తరాది హీరోలు, దర్శకనిర్మాతలు ఫోకస్ చేస్తున్నారు. అందుకే సౌత్ లో హిట్ టాక్ రాగానే వెంటనే హిందీలో రీమేక్ రైట్స్ కొనేస్తున్నారు. కార్తి హీరోగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ‘ఖైదీ’ సినిమాతో కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి సక్సెస్ అందుకుంది.

హీరోయిన్, పాటలు, కామెడీ ఇవేవీ లేకుండానే ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఆడియన్స్ ను మెప్పించింది. కార్తి తన అద్భుత ప్రదర్శనతో సినిమా స్థాయిని మరింత పెంచారు. దీనికి సీక్వెల్ కూడా వస్తుందని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాను రీమేక్ చేస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా ధర్మేంద్ర దర్శకత్వంలో ఈ రీమేక్ రాబోతుందని చాలా రోజుల క్రితమే అనౌన్స్ చేశారు.

అయితే అజయ్ వేరే ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండడం వలన ఈ రీమేక్ ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ సినిమాను మొదలుపెట్టారు. నిజానికి అజయ్ ‘సింగం 3’ సినిమాను మొదలుపెట్టాల్సి వుంది. కానీ అది భారీ సినిమా కావడంతో ఇప్పుడున్న పరిస్థితులు అనుకూలించడం లేదు. దీంతో ఆ సినిమాను వాయిదా వేసి ‘ఖైదీ’ రీమేక్ ను మొదలుపెట్టారు. స్క్రిప్ట్ కి సంబంధించిన పనులన్నీ కూడా అజయ్ దగ్గరుండి చూసుకుంటున్నారు.

నార్త్ ఆడియన్స్ కు తగ్గట్లుగా కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేస్తున్నారు. హీరోయిన్ పాత్రను కూడా యాడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి ‘భోళా’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus