విదేశాల్లో సినిమాలకు అవార్డులు ఇచ్చినప్పుడు.. ఆ సినిమా నటులే కాదు, పోటీలో నిలిచిన సినిమాలు నటులు కూడా వస్తారు. ఎవరికైనా అవార్డు వస్తే అభినందనలు చెప్పి సందడి చేస్తుంటారు. మన దగ్గర అలాంటి పరిస్థితి ప్రైవేటు అవార్డుల విషయంలో కూడా జరగదు. అయితే ఏ సినిమాకు వచ్చిన అవార్డు, ఆ సినిమా టీమ్ తీసుకుంటే, ఆ సినిమాలో నటించిన వాళ్లు చప్పట్లు కొట్టి, ఈలలు వేస్తే బాగుంటుంది. మరి ఇప్పుడు గద్దర్ (Gaddar) అవార్డుల విషయంలో అలా జరుగుతుందా? ఏమో రేపు ఈ విషయం తెలిసిపోతుంది.
ఎందుకంటే 10 ఏళ్లకుగాను ఉత్తమ చిత్రాలు (మూడు) అవార్డులు ఇవ్వనున్నారు. అంటే 30 సినిమాలకు సంబంధించిన అవార్డులు వస్తాయి. ఒక్కో సినిమాకు గాను నాలుగు పురస్కారాలు ఇస్తామని తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ప్రకటించారు. అంటే రేపు కార్యక్రమంలో మామూలు హడావుడి ఉండకూడదు. 30 సినిమాలకుగాను 120 మంది పురస్కారాలు అందుకుంటారు. ఓ పండగలా కార్యక్రమం జరగాలి. అయితే గతంలో నంది అవార్డులు అనుభవం చూస్తే అందరూ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వస్తే మాత్రం గద్దర్ అవార్డులు సక్సెస్ అయినట్లే.
ఈ నెల 14న సాయంత్రం 6 గంటలకి గద్దర్ అవార్డుల వేడుక హైటెక్స్ వేదికగా ప్రారంభం అవుతుంది. 2014 నుంచి 2023 వరకూ ప్రతి ఏడాది మూడు ఉత్తమ చిత్రాల్ని ఎంపిక చేశారు. ప్రతి చిత్రానికి హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత అంటూ నాలుగు పురస్కారాలు ఇస్తారు. ఇక 2024కి సంబంధించి చాలా పురస్కారాలు ఉన్నాయి. ఇన్నాళ్లూ ప్రభుత్వం నుండి మాకు ప్రోత్సాహకం లేదు అని అంటున్న సినిమా పరిశ్రమ నుండది శనివారం ఎంతమంది ముందుకొస్తారు. పురస్కారాలు అందుకుంటారు అనేది చూడాలి.
ఈ పురస్కారాలు కాకుండా ఎన్టీఆర్ (NTR) నేషనల్ ఫిల్మ్ అవార్డు (నందమూరి బాలకృష్ణ) (Nandamuri Balakrishna) , పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు (మణిరత్నం) (Mani Ratnam) , బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు (సుకుమార్) (Sukumar) , నాగిరెడ్డి – చక్రపాణి ఫిల్మ్ అవార్డు (అట్లూరి పూర్ణచంద్రరావు) , కాంతారావు ఫిల్మ్ అవార్డు (విజయ్ దేవరకొండ), రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు (యండమూరి వీరేంద్రనాథ్) కూడా రేపే ఇస్తారు.