నందమూరి హీరోలందరూ కలిసి చేస్తున్న జై లవకుశ

  • April 4, 2017 / 07:17 AM IST

తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఎక్కువమంది హీరోలు వచ్చారు. మహానటుడు ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఎక్కువమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. అయితే వీరందరూ కలిసి నటిస్తే చూడాలని ఫ్యాన్స్ కలలుకంటున్నారు. ఆ కలను నెరవేర్చడానికి తారక్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చేస్తున్న సినిమాలో నందమూరి హీరోలను నటింపజేయించాలని ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో హరికృష్ణ, కళ్యాణ్ రామ్ లు ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇక నటసింహ బాలకృష్ణ కోసం కూడా కీలకమైన రోల్ బాబీ రాసారని, అందులో బాలయ్యని నటింపజేయించేందుకు హరికృష్ణ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. ఈ ప్రయత్నాలు ఫలిస్తే నందమూరి అభిమానులకు జై లవ కుశ  పండుగ లాంటి సినిమా అవుతుంది. అక్కినేని అభిమానులు మనం సినిమాను ఆదరించినట్లు గా నందమూరి ఫ్యాన్స్  జై లవ కుశని సూపర్ డూపర్ హిట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus