Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

సెప్టెంబర్ 25 డేట్ కోసం పెద్ద సినిమాలు పోటీ పడుతున్నట్టు తెలుస్తుంది. ఆల్రెడీ ఆ డేట్ కు నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను..ల ‘అఖండ 2’ (Akhanda2) వస్తుందని అధికారికంగా ప్రకటించారు. అలాగే సాయి దుర్గ తేజ్ (సాయి ధరమ్ తేజ్) ‘SYG‘ (సంబరాల యేటి గట్టు) అనే పాన్ ఇండియా సినిమా కూడా రిలీజ్ అవుతుందని ప్రకటించారు. మరోపక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ (OG) సినిమా కూడా సెప్టెంబర్ 25 నే రిలీజ్ అవుతుందని ప్రకటించారు.

Andhra King Taluka

పవన్ సినిమా వస్తుంది కాబట్టి మేనల్లుడు తేజు రేసు నుండి ఈజీగా తప్పుకుంటాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ‘అఖండ 2’ విషయంలో క్లారిటీ రాలేదు. బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ లో కూడా సెప్టెంబర్ 25నే ‘అఖండ 2’ వస్తుందని ప్రకటించారు. ఆ డేట్ కి కచ్చితంగా ‘అఖండ 2’ వస్తుందా రాదా? అనేది ఆ సినిమా వి.ఎఫ్.ఎక్స్ వర్క్ పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి ‘ఓజి’ అయితే కచ్చితంగా ఆ డేట్ కి వస్తుందని అంతా భావిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో మరో క్రేజీ సినిమా కూడా సెప్టెంబర్ 25 బరిలో నిలబడనున్నట్టు టాక్ నడుస్తుంది. అది మరేదో కాదు రామ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ (Andhra King Taluka). మహేష్ బాబు.పి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సెప్టెంబర్ 25కి రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతుంది.

పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్న ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి వాళ్ళ హీరో సినిమా ‘ఓజి’ ఉండగా ‘మైత్రి..’ వారు ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ ని పోటీగా రిలీజ్ చేస్తారా? లేక ‘ఓజి’ ఏమైనా ఆ డేట్ నుండి తప్పుకుంటుందా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus