Chiranjeevi: అమ్మ బాబోయ్.. మెగాస్టార్ స్పీడ్ మామూలుగా లేదుగా..!

  • August 4, 2021 / 10:42 PM IST

మెగాస్టార్ చిరంజీవి తన ‘ఆచార్య’ చిత్రం షూటింగ్ ను ఫినిష్ చేశారు. రెండు పాటలు మాత్రం బ్యాలన్స్ ఉన్నాయి. దర్శకుడు కొరటాల శివ తన టీంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులని కూడా మొదలుపెట్టేశాడు. మరోపక్క ‘లూసీఫర్’ రీమేక్ పనులు కూడా మొదలైపోయాయి. అంతేకాదు దర్శకుడు బాబీ, మెహర్ రమేష్ లకు కూడా చిరు ఫోన్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టమని చెప్పారట. వచ్చే నెల నుండీ ‘వేదాలం’ రీమేక్ ను లాంచ్ చేయబోతున్నట్టు టాక్ బలంగా వినిపిస్తుంది.

ఈ మూవీకి స్క్రిప్ట్ ఎప్పుడో ఫైనల్ అయిపోయింది.అనఫీషియల్ గా అయితే షూటింగ్ ఎప్పుడో లాంచ్ అయిపోయింది. కోల్ కతాలో పలు మాంటేజ్ షాట్స్ ను కూడా చిత్రీకరించారు. అయితే ఫార్మల్ లాంచ్ ను సెప్టెంబర్ లో చేయబోతున్నట్టు తెలుస్తుంది.అయితే రెగ్యులర్ షూటింగ్ మాత్రం.. మరి కొన్ని నెలల తర్వాత మొదలుపెడతారట.ఇక కథ ప్రకారం ఈ మూవీలో చిరుకి చెల్లెలి పాత్రలో ఓ హీరోయిన్ నటించాల్సి ఉంది. ఆ పాత్ర కోసం సాయి పల్లవి లేదా కీర్తి సురేష్ లలో ఒకరు ఫైనల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.గతేడాది అంటే 2020 జనవరిలోనే ఈ ప్రాజెక్టు ఖరారు అయ్యింది. కానీ కరోనా కారణంగా ఇంకా ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన ఏమి ఇవ్వలేదు నిర్మాతలు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus