ముగ్గురు మళ్లీ కలిసి వస్తున్నారు.. కాసేపట్లో చెప్పేస్తారు!

  • December 29, 2022 / 10:29 AM IST

గురువారం మధ్యాహ్నం 12.06కి ఓ భారీ ప్రాజెక్టు ప్రారంభిస్తాం అంటూ.. టాలీవుడ్‌లోని మూడు పెద్ద నిర్మాణ సంస్థలు బుధవారం ట్వీట్లు చేశాయి. ఆ సినిమా ఏంటి, ఏమై ఉండొచ్చు అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి సోషల్‌ మీడియాలో ప్రభాస్‌ – మారుతి, ప్రభాస్‌ – సుకుమార్‌ అంటూ కొందరు అంటుంటే.. కాదు కాదు ఇంకేదో అని మరికొందరు అంటున్నారు. అయితే అది సీక్వెల్‌ మూవీ అని మరి ఇంకొందరు అంటున్నారు. అయితే అది కచ్చితంగా సీక్వెలే అని చెబుతున్నాయి టాలీవుడ్‌ వర్గాలు.

అడివి శేష్‌ నాలుగేళ్ల క్రితం చేసిన మూవీ మ్యాజిక్‌ గుర్తుందా? అదేనండీ ‘గూఢచారి’. కెరీర్‌ బెస్ట్‌ ఫిల్మ్‌ అంటూ అడివి శేష్‌ లిస్ట్‌ చెప్పాల్సి వస్తే ఆ సినిమాను తొలి ప్లేస్‌ల్లో రాసుకుంటాడు కూడా. అలాంటి సినిమాలు టాలీవుడ్‌లో కొన్ని వచ్చినా.. ఆ సినిమా చూపించిన ఇంపాక్ట్‌ చాలా ఎక్కువ అని చెప్పాలి. ఆ సినిమాకు సీక్వెల్‌ ఉంది అని క్లైమాక్స్‌లో చెప్పారు కూడా. అయితే ఆ తర్వాత దాని గురించి ఎక్కడా సమాచారం లేదు.

అలా అని సీక్వెల్‌ లేదని కొట్టిపారేయలేదు కూడా. ఇప్పుడు ఆ సినిమానే ఈ రోజు అనౌన్స్‌ చేస్తున్నారని టాక్‌. తొలి ‘గూఢచారి’ సినిమాను పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ పిక్చర్స్‌ నిర్మించాయి. అయితే ఇప్పుడు రెండో పార్టు కోసం మూడో నిర్మాత కూడా యాడ్‌ అవుతున్నారు. ఈసారి ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామి కాబోతోంది. ఈ మూడు నిర్మాణ సంస్థలే బుధవారం ట్వీట్లు చేశాయి. తొలి పార్టును ఘనంగా ప్రారంభించి, అంతకుమించి అనే రేంజిలో విడుదల చేశారు.

మరిప్పుడు విశ్వప్రసాద్‌, అభిషేక్‌కు అనిల్‌ సుంకర కలవడంతో ఇంకా భారీగా ఉండబోతోంది అని అంటున్నారు. ‘గూఢచారి’ సినిమా ఓ టిపికల్ స్పై మూవీ. దానికి ఎమోషన్లు, ట్విస్ట్‌లు యాడ్‌ చేసి అదరగొట్టారు అడివి శేష్‌, శశికిరణ్‌ తిక్కా. మరిప్పుడు రెండో పార్టును ఎవరు హ్యాండిల్‌ చేస్తారో చూఆలి. అయితే తొలి కథకు కొనసాగింపా? లేక కొత్త కథను రాసుకున్నారా అనేది తెలియాలి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus