వామ్మో.. రాజమౌళి మరో భారీ స్కెచ్ వేసాడుగా..!

  • February 3, 2020 / 07:25 PM IST

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీ స్టారర్ చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’. అగ్ర నిర్మాత డివివి దానయ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు రాజమౌళి. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాల్ని హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నాడు రాజమౌళి. ఎన్టీఆర్ ఈ చిత్రంలో కొమరం భీమ్ గా కనిపిస్తుండగా.. మరో హీరో రాంచరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రని పోషిస్తున్నాడు.

ఇక ఈ చిత్రం కోసం రాజమౌళి ఓ పెద్ద స్కెచ్ వేసాడట. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అలాగే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబులతో ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడట. అయితే మరీ ఎక్కువ ఆశపడకండి. ఈ చిత్రంలో వారు పోషించే పాత్రలు జస్ట్ వాయిస్ ఓవర్లు ఇవ్వడమే. ఈ చిత్రం హిందీ వెర్షన్ కు అమితాబ్ బచ్చన్.. అలాగే తెలుగు వెర్షన్ కు మహేష్ బాబు వాయిస్ ఓవర్ లు ఇవ్వబోతున్నారట. ఇటీవల వీరిద్దరిని రాజమౌళి కలిసి.. ఓకే అనిపించినట్టు సమాచారం. ఇది నిజమైతే.. ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ అయ్యే అవకాశం ఉందని చెప్పడంలో సందేహం లేదు.

Most Recommended Video

అల్లు అర్జున్ ఆస్తుల వివరాలు
అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus