Pawan Kalyan, Rana: పవన్ మూవీలో మళ్లీ ఫ్లాష్‌బ్యాక్.. ఫ్యాన్స్ లో టెన్షన్..?

  • May 25, 2021 / 08:49 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్, రానా అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ సినిమాల తరువాత ఆ సినిమా స్థాయిలో కమర్షియల్ సక్సెస్ సాధించని రానా ఈ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త తెగ వైరల్ అవుతుండగా ఆ వార్త విషయంలో పవన్ ఫ్యాన్స్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయ్యప్పనుమ్ కోషియమ్ ఒరిజినల్ వెర్షన్ లో ఫ్లాష్‌బ్యాక్ లేకపోయినా తెలుగులో తెరకెక్కుతున్న రీమేక్ లో మాత్రం ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందని సమాచారం. పవన్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకుని దర్శకుడు సాగర్ కే చంద్ర ప్లాష్ బ్యాక్ సీన్ల‌ను యాడ్ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే పింక్ రీమేక్ వకీల్ సాబ్ కు ప్లాష్ బ్యాక్ సీన్లు మైనస్ ఆయ్యాయనే సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాలో ప్లాష్ బ్యాక్ సీన్ల‌ను తొలగించాలని ప్రేక్షకుల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు వినిపించాయి.

అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ కు ప్లాష్ బ్యాక్ సీన్లు ప్లస్ అవుతాయో లేదో తెలియాలంటే సినిమా రిలీజయ్యే వరకు ఆగాల్సిందే. ఈ ఏడాది సెకండాఫ్ లో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తుండటం గమనార్హం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కొత్త లుక్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

Most Recommended Video

10 మంది టాలీవుడ్ సెలబ్రిటీలు మరియు వారి అలవాట్లు..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!
ఈ 15 మంది సెలబ్రిటీలు బ్రతికుంటే మరింతగా రాణించే వారేమో..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus