చిలసౌ సినిమాపై అనసూయ ప్రశంసల జల్లు

  • August 8, 2018 / 07:10 AM IST

తొలి సినిమాతోనే మంచి దర్శకుడిగా రాహుల్ రవీంద్రన్ నిరూపించుకున్నారు. అతను మెగా ఫోన్ ని పట్టుకొని చేసిన తొలి మూవీ “చిలసౌ”. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన ఈ మూవీ ఆగస్ట్‌ 3న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ మంచి కలక్షన్స్ రాబడుతోంది. ఈ సినిమా చూసి సమంత “రాహుల్‌ యాక్టర్‌గా నాకు కనెక్ట్‌ కాలేదు కానీ.. డైరెక్టర్‌గా కనెక్ట్‌ అయ్యాడు” అంటూ అభినందించింది. నాగార్జున కూడా ప్రశంసలు గుప్పించారు.

తాజాగా యాంకర్, నటి అనసూయ స్పందించింది. “చిలసౌ చూసిన తర్వాత నేను మరోసారి ప్రేమలో పడ్డాను. ఇందులో ఈ తరం యువతీ యువకుల కన్ఫ్యూజ్ ని చక్కగా చూపించారు. దర్శకుడిగా రాహుల్ విజయం సాధించారు. సుశాంత్ ఇదివరకు సినిమాలలో కంటే ఇందులో బాగా నటించారు” అని అభినందనలు కురిపించింది. ఇంకా వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. “వెన్నెల కిషోర్ యాక్టింగ్ కి నవ్వి నవ్వి ఆస్పత్రిలో చేరిపోతానేమో అనేంత బయమేసింది” అంటూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికపై పంచుకుంది. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్న ఈ మూవీ బ్లక్ బస్టర్ హిట్ దిశగా అడుగులు వేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus