అనసూయ ఊరూరా తిరికి నాటకాలు ఆడుతుందట

  • March 31, 2020 / 06:57 PM IST

క్రియేటివ్ దర్శకుడిగా పేరున్న కృష్ణ వంశీ కెరీర్ లో నిన్నే పెళ్లాడతా, మురారి, ఖడ్గం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తీశారు. ఈయన తెలుగులో తీసిన అంతఃపురం చిత్రానికి ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ చిత్రం ఆయనకు మంచి పేరుతెచ్చి పెట్టింది. అదే చిత్రాన్ని హిందీలో షారుక్, నానా పటేకర్, ఐశ్వర్య రాయ్ వంటి స్టార్ క్యాస్ట్ తో శక్తి పేరుతో ఆయన రీమేక్ చేశారు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ స్థాయికి దగ్గ హిట్ అందుకొని చాల కాలం అవుతుంది. 2007లో కాజల్ ప్రధాన పాత్రలో వచ్చిన చందమామ తర్వాత ఆయన క్లీన్ హిట్ అందుకోలేదు.

దీనితో ఆయన ఓ రీమేక్ తో వస్తున్నారు. మరాఠీ సూపర్ హిట్ మూవీ నటసామ్రాట్ ని తెలుగులో రంగమార్తాండ పేరుతో రీమేక్ చేస్తున్నారు కృష్ణవంశీ. ఈ మూవీలో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఐతే ఈ చిత్రంలో హాట్ యాంకర్ అనసూయ ఓ ముఖ్యపాత్ర చేస్తుండగా ఆమె పాత్రపై ఆసక్తికర విషయం ప్రచారం అవుతుంది. తాజాగా అందిన సమాచారం మేరకు ‘రంగమార్తాండ’ సినిమాలో ‘రంగస్థల నటి’గా అనసూయ కనిపించనుందని తెలుస్తోంది.

ఊరూరా తిరుగుతూ నాటకాలు ప్రదర్శించే స్టేజ్ ఆర్టిస్ట్ రోల్ ఆమె చేస్తున్నట్లు వినికిడి. గత సినిమాలతో పోల్చితే ఇందులో ఆమె లుక్ మరింత గ్లామరస్‌గా ఉంటుందని తెలిసింది.ఒరిజినల్ వెర్షన్‌లో నానా పటేకర్ పోషించిన పాత్రను తెలుగు వర్షన్‌లో ప్రకాష్ రాజ్ చేస్తున్నారు.ఈ సినిమాను అభిషేక్ అండ్ మధు నిర్మిస్తుండగా హాస్య నటుడు బ్రహ్మానందం ఓ ప్రాముఖ్యం ఉన్న పాత్ర చేస్తున్నారు. మరి రీమేక్ అయినా కృష్ణ వంశీని ప్లాప్స్ నుండి బయటపడేసి హిట్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus