అక్కినేని ఫ్యాన్స్ కు మంచి కిక్ ఇచ్చే న్యూస్..!

  • November 12, 2020 / 07:47 PM IST

గతేడాది వెంకటేష్, వరుణ్ తేజ్ లతో ‘ఎఫ్2’ అనే మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్ కు రెండింతల లాభాలను ఆర్జించారు. అంతేకాదు ఈ ఏడాది మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ అనే మరో బ్లాక్ బస్టర్ ను తెరకెక్కించి.. వరుసగా 5 హిట్లను అందుకున్న దర్శకుడిగా రికార్డుకెక్కాడు అనిల్. ఇక ఈ ఏడాది ‘ఎఫ్2’ సీక్వెల్ అయిన ‘ఎఫ్3’ ను తెరకెక్కించాలని భావించిన అనిల్ కు..

కరోనా లాక్ డౌన్ వల్ల పెద్ద దెబ్బ పడింది. ప్రస్తుతం అనిల్ ఖాళీగానే ఉన్నాడు. అతని దగ్గర మూడు, నాలుగు బౌండ్ స్క్రిప్ట్ లు ఉన్నాయి. అవి కొంతమంది హీరోలకు చెప్పి ఓకే చేయించుకున్నాడు కూడా..! అయినా సరే వాళ్లంతా ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన ప్రస్తుతం అనిల్ తో సినిమాలు చేయలేకపోతున్నారు. అయితే అనిల్ మాత్రం క్రేజీ ప్రాజెక్టులనే లైన్లో పెట్టుకుంటున్నాడు. మొదటగా ‘ఎఫ్3’ ను కంప్లీట్ చేసిన తరువాత..

అఖిల్- నాగార్జునలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నాడట అనిల్. ‘ఎఫ్3’ పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టుని సెట్స్ పైకి తీసుకువెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడట. అప్పటికి నాగార్జున కమిట్ అయిన ప్రాజెక్టులు కూడా ఫినిష్ అయిపోతాయి కాబట్టి.. ఆయన కూడా ఓకే చెప్పేసాడని వినికిడి. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో అఖిల్ కు కూడా ఇది మంచి అవకాశమనే చెప్పాలి.

Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus