Animal 2: ‘యానిమల్‌ 2’ ఫ్యాన్స్‌కి షాక్‌.. సినిమా విషయంలో మార్పులు!

  • April 22, 2024 / 01:25 PM IST

ఇండియన్‌ సినిమాలో అప్పుడప్పుడు మార్పులు జరుగుతుంటాయి. అప్పటివరకు వచ్చిన సినిమాలు, చూపించిన విధానాలు మార్చేస్తుంటారు మన దర్శకులు. అలా రీసెంట్‌ టైమ్‌లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) . తండ్రీ కొడుకుల మధ్య ప్రేమ ఇలా కూడా ఉంటుందా అనే డౌట్‌ వచ్చేలా ఓ వయలెంట్‌ సినిమాను తీసుకొచ్చారు. అయితే ఆయన దానిని వయలెంట్‌ అని ఒప్పుకోకపోవచ్చు. ఆ సినిమానే ‘యానిమల్‌’. దీనికి సీక్వెల్‌ ఉంటుందని ఇప్పటికే చెప్పారు.

అయితే ఇప్పుడు వార్త ఏంటంటే… ఈ సినిమా లేట్‌ అయ్యేలా ఉంది అని. ‘యానిమల్‌’ సినిమా సంచలన విజయంతో యావత్తు భారతదేశ సినీ పరిశ్రమ దృష్టిని తనవైపునకు తిప్పుకున్నారు సందీప్‌ రెడ్డి వంగా. బాక్సాఫీసు రికార్డు స్థాయిలో రూ. వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor), రష్మిక మందన (Rashmika) జంటగా నటించిన ఈ సినిమాకు కొనసాగింపుగా ‘యానిమల్‌ పార్క్‌’ తీస్తామని చెప్పారు. దీంతో 2025లోనే సినిమా వచ్చేస్తుందేమో అని అనుకున్నారంతా.

కానీ ఇప్పుడు టీమ్‌ మాటలు చూస్తుంటే మరో మూడేళ్లు పట్టేలా ఉంది అని అంటున్నారు. ‘యానిమల్‌ పార్క్‌’ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ సందీప్‌ రెడ్డి వంగా క్లారిటీ ఇచ్చేశారు. ‘యానిమల్‌ పార్క్‌’ సినిమా చిత్రీకరణను 2026లో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు. అంటే సినిమా 2026లో రాదు. ఆయన స్టైల్‌ ప్రకారం చూస్తే 2027లోనే సినిమా వస్తుంది అని చెప్పొచ్చు. అయితే ఇది 2026లో మొదలైతేనే. స్టార్టింగ్‌ లేట్‌ అయితే సినిమా ఇంకా లేట్‌ అవ్వొచ్చు.

అయితే తొలి పార్టు ‘యానిమల్‌’ కన్నా మరింత భారీగా.. మరింత హింసాత్మకంగా ‘యానిమల్‌ పార్క్‌’ ఉండబోతోంది అని సందీప్‌ చెప్పారు. ప్రేక్షకుల ఊహాలకు అందని యాక్షన్‌ సన్నివేశాలతో ‘యానిమల్‌ పార్క్‌’ తెరకెక్కిస్తామని క్లారిటీ ఇచ్చారు సందీప్‌. దీంతో అభిమానుల్లో ఈ సారి ఎలాంటి సినిమా చూపించబోతున్నారు అనే చర్చ మొదలైంది. ఆ సినిమాలోపు సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ పనులు పూర్తి చేస్తారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus