అలియా ర్యాంకింగ్ ఒకటి నుండి 12కి పడిపోయింది..!

  • August 30, 2020 / 12:39 PM IST

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వలన ఏర్పడిన వివాదం, ఆగ్రహ జ్వాలలు ఇంకా చల్లారలేదు. బాలీవుడ్ పెద్దలపై సుశాంత్ ఫ్యాన్స్ ఇంకా ఫైర్ అవుతూనే ఉన్నారు. బాలీవుడ్ లో నేపోటిజానికి బలైపోతున్న వారికి మద్దతు పలకడంతో పాటు, స్టార్ వారసులపై దుమ్మెత్తి పోస్తున్నారు. సుశాంత్ మరణంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దర్శకుడు మహేష్ భట్ పాత్ర ఉందని సుశాంత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అలాగే ఆయన కూతురు అలియా భట్ పై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు చేస్తున్నారు.

మహేష్ భట్ దర్శకత్వంలో కూతురు అలియా ప్రధాన పాత్రలో నటించిన సడక్ 2 ట్రైలర్ పై నెగెటివ్ ప్రచారం చేయడం జరిగింది. భవిష్యత్తులో అలియాకు సినిమా ఆఫర్ ఇవ్వాలంటే దర్శక నిర్మాతలు భయపడేలా వారు సడక్ 2 ట్రైలర్ ని తిరస్కరించడం జరిగింది. ఇది ఆమె మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. వ్యాపార ప్రకటనల విషయంలో ఆమె బ్రాండ్ వాల్యూ కూడా పడిపోతుంది. ఆమె పాపులారిటీ ఎంతగా పడిపోయిందో చెప్పడానికి టైమ్స్ సర్వే ఫలితాలే నిదర్శనం.

ప్రతి ఏడాది టైమ్స్ ప్రకటించే మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 ర్యాంకింగ్స్ లో అలియా ఏకంగా 12వ స్థానానికి పడిపోయింది. గత ఏడాది మొదటిస్థానంలో ఉన్న అలియా కనీసం టాప్ టెన్ లో కూడా చోటు సంపాదించలేక పోయింది. ఇక ఈఏడాది మొదటిస్థానం హాట్ బ్యూటీ దిశా పటాని కైవశం చేసుకుంది.

Most Recommended Video

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus