తారక్ కోసం మరో ఫ్యామిలీ స్టోరీ!

  • November 4, 2017 / 06:59 AM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ స్వింగ్ ల్లో ఉన్నారు.  జై లవకుశ తో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతలో వేసుకున్నారు. ఈ మూవీ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్న సినిమాని కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ సినిమాతో  డైరక్టర్ త్రివిక్రమ్ బిజీగా ఉండడంతో ఈ చిత్రం షూటింగ్ కి వెళ్ళడానికి మరో మూడు నెలలు సమయం పట్టేట్టు ఉంది. ఆ సమయాన్ని కథలు వినడానికి కేటాయించాలని తారక్ అనుకున్నారు. అనుకోవడమే కాదు… ఒక కథని ఫైనల్ చేసారని ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి.

శతమానం భవతి డైరక్టర్ సతీష్ విజ్ఞేశ చెప్పిన ఫ్యామిలీ కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చిందంట. వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో..  డైరక్టర్ స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టినట్లు సమాచారం. దీనిని నిర్మాత దిల్ రాజు నిర్మించడానికి ఉత్సాహంగా ఉన్నారు. గతంలో ఎన్టీఆర్, దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన బృందావనం మంచి హిట్ అందుకుంది. ఈ సారి ఈ కాంబో సూపర్ హిట్ అందుకోవడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus