అక్కినేని ఫ్యాన్స్ కు ఇది గూజ్ బంప్స్ తెప్పించే న్యూసే..!

  • November 30, 2020 / 09:43 PM IST

‘మనం’ చిత్రం అక్కినేని ఫ్యాన్స్ కు ఒక గోల్డెన్ క్లాసిక్ లాంటిది. అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ అంతా ఈ సినిమాలో కనిపిస్తారు. అయితే ఇప్పుడు నాగేశ్వరరావు గారు లేరు కదా.. మళ్ళీ ‘మనం’ ఎలా కుదురుతుంది? అనే డౌట్ మీకు రావచ్చు. అయితే ఈసారి మనం సీక్వెల్ తెరకెక్కడం లేదు. కానీ అక్కినేని హీరోలు అంతా మళ్ళీ ఓ సినిమాలో కనిపించి సందడి చెయ్యబోతున్నారు. ఆ చిత్రం మరేదో కాదు ‘బంగార్రాజు’.

2016లో విడుదలయ్యి సూపర్ హిట్ అయిన ‘సోగ్గాడే చిన్ని నాయన’ కు ఇది సీక్వెల్. కళ్యాణ్ కృష్ణ కురసాలనే ఈ సీక్వెల్ ను కూడా తెరకెక్కించనున్నాడు. నిజానికి 2019లోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ స్క్రిప్ట్ ఫైనల్ కాకపోవడంతో ప్రాజెక్టు ప్రారంభంకాలేదని తెలుస్తుంది. అయితే ఇటీవల దర్శకుడు కళ్యాణ్ కృష్ణ.. నాగార్జునని కలిసి ఫైనల్ వెర్షన్ వినిపించి ఓకే చేయించుకున్నాడని వినికిడి. ‘బిగ్ బాస్4’ పూర్తయిన వెంటనే ‘బంగార్రాజు’ సెట్స్ పైకి వెళ్లబోతుందట.

అంతేకాదు ఈ చిత్రంలో ‘బంగార్రాజు’ మనవళ్లుగా నాగ చైతన్య, అఖిల్ కూడా కనిపించబోతున్నారని తాజా సమాచారం. సమంత కూడా నాగ చైతన్య సరసన నటించే అవకాశం ఉందని టాక్. ఇక అఖిల్ సరసన రష్మిక నటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus