నానా పటేకర్ చుట్టూ బిగిసుకుంటున్న ఉచ్చు!

  • October 1, 2018 / 02:06 PM IST

క్యాస్టింగ్ కౌచ్ పై ఇప్పటివరకు అనేకమంది మాట్లాడారు. శ్రీ రెడ్డి అయితే చిన్న పోరాటమే చేసింది. ఆమె తర్వాత ఆ రేంజ్ లో మాట్లాడిన నటి తనుశ్రీ దత్తా.  ‘వీరభద్ర’ సినిమాలో బాలకృష్ణ సరసన నటించిన తనుశ్రీ దత్తా .. బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. అయితే 2008 లో ఒక షూటింగ్ సమయంలో వేధింపులకు గురయ్యానని రీసెంట్ గా ఇంటర్వ్యూ లో బయటపెట్టి బ్రేకింగ్ న్యూస్ అయింది. “హార్న్ ఒకే ప్లీజ్” సినిమా పాట షూటింగ్ జరిగేసమయంలో నానా పటేకర్ తనను చెయ్యి పట్టిలాగారని ఆరోపించింది.  ఆ రోజు నానాతో షూటింగ్ చేయనని చెప్పినందుకు రౌడీలతో తనపై దాడి చేయించాడని కూడా ఆరోపణలు చేసింది.

ఆరోపణలేకాదు… అందుకు తగ్గ ఆధారం కూడా బయటపెట్టింది. తనుశ్రీ తన పేరెంట్స్ తో కలిసి వెళుతుండగా కొందరు ఆమె కారును అడ్డుకున్నారు.  కారును చుట్టుముట్టి అద్దాలు పగలగొట్టారు. ఒకరు కారెక్కి పైకి కిందకి గెంతాడు. టైర్లకు కాలి కూడా తీసేశారు. ఏ వీడియో ప్రస్తుతం వైరల్ అయింది.  దాడి వీడియో బయటకు రావడంతో ఇది నానా పటేకర్ కి ఇబ్బందికరంగా పరిణమించే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్స్ తను శ్రీకి అండగా నిలవడానికి ముందుకు వస్తున్నారు. దాడిపై విచారణ జరిపించాలని రవీనా టాండన్ కోరింది. అజ్ఞాతంలోకి వెళ్లిన నానా పటేకర్ ని మీడియా ముందుకు తీసుకురావడానికి ముంబై పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus