Balakrishna: ఆ విషయంలో బాలయ్య ఎన్టీఆర్ సేమ్ టు సేమ్.. ఏమైందంటే?

  • September 3, 2024 / 07:05 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ  (Balakrishna)  ఒకవైపు స్టార్ హీరోగా కొనసాగుతూనే మరోవైపు హిందూపురంకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా ఆదుకునే విషయంలో ముందువరసలో ఉండే బాలయ్య తాజాగా మరోసారి మంచి మనస్సును చాటుకున్నారు. కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన బాలయ్య ఈ మొత్తంలో ఏపీకి 50 లక్షల రూపాయలు, తెలంగాణకు 50 లక్షల రూపాయలు ప్రకటించి మంచి మనస్సును చాటుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్  (Jr NTR) కోటి రూపాయలు విరాళంగా ప్రకటించిన కొన్ని గంటల్లోనే బాలయ్య సైతం అంతే మొత్తాన్ని విరాళంగా ప్రకటించడం కొసమెరుపు.

Balakrishna:

విరాళం విషయంలో బాలయ్య  (Balakrishna)  తారక్ సేమ్ టు సేమ్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరో బాలయ్య తన పోస్ట్ లో 50 సంవత్సరాల క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉందని పేర్కొన్నారు. ఇప్పటికీ నా నట ప్రస్థానం సాగుతూనే ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగు జాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది అని ఆయన అన్నారు.

ఈ రుణం తీరనిదని ఈ జన్మ మీకోసం మీ ఆనందం కోసం అని బాలయ్య చెప్పుకొచ్చారు. నా ఈ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం తెలుగు నేలను వరద ముంచెత్తుతోందని ఈ విపత్కర పరిస్థితుల్లో బాధాతప్త హృదయంతో ఏపీ సీఎం సహాయనిధికి 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం సహాయ నిధికి 50 లక్షల రూపాయలు బాధిత ప్రజల సహాయార్థం విరాళంగా అందిస్తున్నానని బాలయ్య పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొనాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలయ్య కోటి రూపాయల విరాళం ప్రకటించడంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. నందమూరి హీరోలు గొప్ప మనస్సును చాటుకుని వార్తల్లో నిలిచారు.

గోపీచంద్ పైనే ఆశలు పెట్టుకున్న కావ్య..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus