Balakrishna: చేతబడి నుంచి అలా బయటపడ్డానన్న నటి!

  • August 3, 2021 / 11:20 AM IST

సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ఆదిత్య 369 సినిమాతో నటి మోహిని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించిన ఈ నటి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పెళ్లైన ఐదు సంవత్సరాల తర్వాత తనకు మానసిక సమస్యలు ఏర్పడ్డాయని హోదా, ఆస్తిపాస్తులు ఉన్నా ఏదో తెలియని వేదన తనను వెంటాడేదని ఆమె అన్నారు. రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేయడంతో కుటుంబ సభ్యులు జ్యోతిష్కుడికి చూపించగా తనకు చేతబడి చేశారని వాళ్లు చెప్పారని మోహిని తెలిపారు.

అయితే ఒకరోజు ధ్యానం చేస్తున్న సమయంలో తనకు క్రీస్తు కనిపించారని నన్ను కాపాడతాననే విధంగా క్రీస్తు నవ్వారని మోహిని వెల్లడించారు. ఆ తర్వాత ఏసుస్వామే దేవుడని తెలిసిందని సమస్యల నుంచి బయటపడ్డానని మోహిని అన్నారు. ఒక పాస్టర్ తన ఇంటికి వచ్చి ప్రార్థనలు చేశారని ఆ సమయంలో తాను 13 యాసల్లో మాట్లాడానని మోహిని చెప్పారు. హిట్లర్ సినిమాలో చెల్లి పాత్ర చేయవద్దని చిరంజీవి తనకు చెప్పారని అయితే సుహాసిని గారు ఒప్పించడంతో చిరంజీవి ఏమీ అనలేదని మోహిని తెలిపారు.

నాగార్జున గారికి తాను ఫ్యాన్ అని అయితే గ్లామర్ రోల్స్ లో నటించడం ఇష్టం లేకపోవడంతో నాగార్జున సినిమాలో ఆఫర్ వచ్చినా వదులుకున్నానని మోహిని వెల్లడించారు. మంచి పాత్రలు లభిస్తే మళ్లీ సినిమాల్లో నటిస్తానని రమణ మహర్షి కజిన్ బ్రదర్ తన తాతగారని మోహిని చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత తాను క్రైస్తవ మతంలోకి మారానని మోహిని పేర్కొన్నారు.

Most Recommended Video

ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus