Balakrishna: ఏపీ పాలిటిక్స్ పై సెటైర్స్ వేసిన బాలయ్య?

  • October 14, 2023 / 06:32 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈయన హీరోగా నటిస్తూనే మరోవైపు ఆహాలో ప్రసారమవుతున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమంలో కూడా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే రెండు సీజన్లు ఎంతో విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం మూడవ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. దసరా పండుగ సందర్భంగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 17వ తేదీ ప్రసారం కాబోతోంది.

ఈ కార్యక్రమానికి మొదటి ఎపిసోడ్ లో భాగంగా బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి టీం నుంచి డైరెక్టర్ అనిల్ రావిపూడి శ్రీ లీల కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. ఇక వీరందరితో కలిసి బాలయ్య ఎంతో సరదాగా ముచ్చటించారు. అయితే ఈ ప్రోమోలో భాగంగానే ఈయన మాట్లాడుతూ చెప్పిన డైలాగ్స్ సంచలనంగా మారాయి. మేము తప్పు చేయమని అందరికీ తెలుసు. మేము ఎవరికి తలవంచము మమ్మల్ని ఆపడానికి ఎవరు వస్తారు అంటూ చెప్పినటువంటి డైలాగ్స్ పొలిటికల్ హీట్ పెంచాయి.

అదేవిధంగా సినిమా అయినా జీవితం అయినా అంత సవ్యంగా సాగుతుంది అనుకున్న సమయంలో ఒకడు వచ్చి నాశనం చేస్తాడు తిరిగి దానిని సెట్ చేయాలి అంటే హీరోలు జైలు నుంచి బయటకు రావాల్సిందే అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ ప్రోమో కి హైలైట్ గా ఉంది. ఈ ప్రోమోలో బాలకృష్ణ పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి అలాగే చంద్రబాబు నాయుడుని హీరోతో పోలుస్తూ తాను బయటకు రావాలి అంటూ ఈయన కామెంట్స్ చేశారని పలువురు ఈ ప్రోమో పై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుంది. ఇక చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన తర్వాత (Balakrishna) బాలకృష్ణ రాజకీయాల పరంగా చాలా యాక్టివ్ అయ్యారు ఈ క్రమంలోనే ఈయన చెప్పినటువంటి ఈ డైలాగ్స్ కూడా రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడారని అర్థం అవుతుంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus