మంత్రాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బాలకృష్ణ.. కారణం ఏమిటంటే?

  • December 7, 2022 / 06:15 PM IST

నందమూరి నటి సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. తాజాగా ఈయన నటించిన వీర సింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయింది. ఇక ఈ సినిమా అనంతరం బాలకృష్ణ తన తదుపరి చిత్రం అనిల్ రావిపూడితో చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే బాలకృష్ణకుఎంతో దైవభక్తి ఉందనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈయన తన సినిమాలో షూటింగులకు ముందు విడుదలకు ముందు పలు ఆలయాలను సందర్శించి స్వామి వారి ఆశీస్సులు తీసుకుంటారు.

ఈ క్రమంలోనే నేడు బాలకృష్ణ మంత్రాలయంలో సందడి చేస్తున్నట్టు తెలుస్తుంది.ఇలా మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం వేద పండితులు ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ విధంగా బాలకృష్ణ మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి టెంపుల్ సందర్శించడానికి గల కారణం బాలకృష్ణ కొత్త సినిమా ప్రారంభం కావడమే కారణమని తెలుస్తుంది.బాలకృష్ణ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో బాలకృష్ణ రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని సందర్శించినట్లు సమాచారం.

ఇక బాలకృష్ణ తప్పనిసరిగా తన సినిమాల ప్రారంభానికి ముందు అలాగే విడుదలకు ముందు పలు ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. ఇక ఈయన సినిమాలు మాత్రమే కాకుండా టాక్ షోలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని బాలకృష్ణ ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus