బాలయ్య ద్విపాత్రాభినయం..?

  • April 14, 2016 / 02:01 PM IST

గౌతమి పుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తన 100 వ చిత్రం రూపొందనుందని, ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించనున్నాడని, ఉగాది పర్వదినాన అమరావతి వేదికగా నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో బాలకృష్ణ ప్రస్తుత తరానికి తగ్గ వ్యక్తిగా, గౌతమి పుత్ర శాతకర్ణిగా రెండు పాత్రల్లో కనిపించనున్నాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించిన లెజెండ్, సింహా, ఆదిత్య 369 తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు నమోదు చేశాయి. ఈ సెంటిమెంట్ తో ఈ చిత్రం కూడా బాలయ్య విజయాల ఖాతాలో చేరిపోవడం ఖాయమనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు బాలయ్య అభిమానులు. ఈ చిత్రంలో రాజమాత పాత్రలో హేమమాలిని నటించనుంది.  ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూ.50 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 22 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus