Balakrishna: బాలయ్య మిస్సింగ్ అంటూ ఫిర్యాదు.. కానీ?

  • January 31, 2022 / 01:14 PM IST

స్టార్ హీరో బాలయ్య 2021 సంవత్సరంలో అఖండ సినిమాతో, అన్ స్టాపబుల్ షోతో సక్సెస్ సాధించారనే సంగతి తెలిసిందే. బాలయ్య గోపీచంద్ మలినేని మూవీ షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే బాలయ్య మిస్సింగ్ అంటూ తాజాగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది.

వరుసగా షూటింగ్ లతో బిజీగా ఉండటం, కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో బాలయ్య గత కొన్ని నెలలుగా హిందూపురం నియోజకవర్గానికి వెళ్లడం లేదనే సంగతి తెలిసిందే. అయితే నియోజకవర్గం అభివృద్ధి కోసం బాలయ్య ఎల్లవేళలా కృషి చేస్తుంటారు. హిందూపురంను జిల్లాకేంద్రంగా ప్రకటించాలని తాజాగా బాలయ్య డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం సత్యసాయి జిల్లా పేరుతో పుట్టపర్తి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయగా స్థానికంగా ఉండే బీజేపీ నేతలు హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హిందూపురం జిల్లా కొరకు జరుగుతున్న ఉద్యమంలో బాలకృష్ణ పాల్గొనాలని స్థానిక బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బాలయ్య వరుసగా మాస్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. వెంకీ, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఎఫ్3 మూవీ షూటింగ్ పూర్తైన సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి బాలయ్య కాంబో మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది. అనిల్ రావిపూడి బాలయ్య ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేయనున్నారు.

గతంలో బాలయ్య కోసం ఒక కథను సిద్ధం చేసిన అనిల్ రావిపూడి ఆ కథను పక్కన పెట్టేశారని ప్రస్తుతం కొత్త స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. బాలయ్య అఖండ సక్సెస్ ను కంటిన్యూ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. తర్వాత సినిమాలతో బాలయ్య అఖండ స్థాయి విజయాలు అందుకుంటారో లేదో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus