తారక్కు (Jr NTR) ఫుడ్ అంటే బాగా ఇష్టం.. ఇది కొత్త విషయమేమీ కాదు. ఎన్నో సందర్భాల్లో ఆయనే చెప్పాడు. అంతేకాదు తన తిండి ఘనతను కూడా వివరించారు. బావర్చీ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ను లేపేస్తే అని కూడా చెప్పడం మనం విన్నాం. ఇప్పుడు అలాంటి కథే మరొకటి తెలిసింది. ‘భైరవం’ (Bhairavam) సినిమా ప్రచారం కోసం ఓ యూట్యూబ్ కార్యక్రమంలో మాట్లాడుతూ తారక్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడాడు సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas). దీంతో మరోసారి ఆశ్చర్యపోవడం అభిమానుల వంతు అయింది.
‘ఆది’ (Aadi) సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడు సినిమా టీమ్తోపాటు నిర్మాత తనయుడిగా సాయి శ్రీనివాస్ కూడా వెళ్లాడు. ఇద్దరికీ మంచి పరిచయం ఉండటంతో ఓసారి బయటకు వెళ్లారట. అలా మెక్ డొనాల్డ్స్ చూసి బర్గర్ తిందాం అనుకున్నారట. వెంటనే లోపలకు వెళ్లి బర్గ్లు తినడం మొదలుపెట్టారట. ఈ క్రమంలో తారక్ ఎన్ని తిన్నాడో కూడా లెక్క లేదు అని చెప్పాడు సాయి శ్రీనివాస్. వరుస పెట్టి తింటూనే ఉన్నాడు అని చెప్పాడు సాయి శ్రీనివాస్. అంతగా ఫుడ్ను ఇష్టపడతాడు అని చెప్పుకొచ్చాడు.
అంతేకాదు విమానాల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు తమ చేతుల్లో ఉండే బటర్ క్రాస్టెంట్లను సైతం లాగేసుకొని మరీ తినేసేవాడు అని చెప్పాడు. అప్పుడు తాము చిన్నపిల్లలం కావడం వల్ల ఏమీ అనకుండా ఉండేవాళ్లం అని చెప్పుకొచ్చాడు. అలాంటి తారక్ ఇప్పుడు పూర్తి ఫిట్గా మారడం ఆశ్చర్యంగా ఉందని, అది అతని డెడికేషన్కి నిదర్శనం అని చెప్పుకొచ్చాడు సాయి శ్రీనివాస్. అలా తారక్ తిండి పిచ్చి పుస్తకంలో మరో పేజీ బయటకు వచ్చింది.
ఇక తారక్ సంగతి చూస్తే.. ‘వార్ 2’ (War 2) , ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమాల కోసం ఇప్పుడు మరింత సన్నబడ్డాడు. కొత్త లుక్లో బాగున్నా ఎందుకింత సన్నబడుతున్నాడు అనే ప్రశ్న అయితే వినిపిస్తోంది. సినిమాలు వస్తే కానీ ఎందుకు అంత తగ్గాల్సి వచ్చింది అనేదే తెలియదు.