గోపీచంద్ కాదు, రవితేజ కాదు.. బెల్లంకొండ శ్రీనివాస్ తోనే మారుతి సినిమా..!

  • September 6, 2020 / 11:02 AM IST

కరోనా వైరస్ మహమ్మారి వల్ల ఏర్పడ్డ లాక్ డౌన్ వల్ల సినిమా షూటింగ్ల షెడ్యూల్స్ మొత్తం తారుమారు అయిపోయాయి. అందుకే ఏ ప్రాజెక్టు మొదలుపెట్టని దర్శకులు ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోలే కాదు మీడియం రేంజ్ హీరోలు కూడా ఖాళీగా లేరు. అందుకే చాలా మంది టాప్ డైరెక్టర్లు ఎవరితో సినిమా చెయ్యాలో తెలియని అయోమయంలో పడ్డారు. ‘ప్రతీరోజూ పండ‌గే’ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చి కూడా దర్శకుడు మారుతి ఖాళీగా గడుపుతున్నాడు.

అతని నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.మొన్నటి వరకూ గోపీచంద్ తో మారుతీ సినిమా ఉంటుందని వార్తలు వినిపించాయి. కానీ అందులో నిజం లేదని మారుతీ పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు రామ్‌, ర‌వితేజ లను కూడా మారుతీ అప్రోచ్ అయ్యి కథలు వినిపించాడని టాక్. ర‌వితేజ‌తో అయితే ఓకే చెప్పాడని అతనితో మారుతీ నెక్స్ట్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ రవితేజ.. రమేష్ వర్మ డైరెక్షన్లో సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. దాంతో ఇప్పుడు .. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో సినిమా చేయాల‌ని మారుతి భావిస్తున్నాడ‌ని సమాచారం‌.

ఇటీవల దర్శకుడు మారుతి.. బెల్లంకొండ‌ను కలిసి ఓ కథ వినిపించాడట.అది నచ్చడంతో బెల్లంకొండ సానుకూలంగా స్పందించాడని తెలుస్తుంది. అయితే… అక్టోబ‌రు నుండీ డిసెంబ‌రులోగా.. డేట్లు కావాల‌ని మారుతీ అడిగాడట‌. ఆ టైంలో చాలా బిజీ అని బెల్లంకొండ చెప్పాడట. డేట్స్ అడ్జస్ట్మెంట్లు చేస్తే మారుతీతో సినిమా చెయ్యొచ్చు. ప్రస్తుతం ఆ దిశగా బెల్లంకొండ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus