Bhairavam: ‘భైరవం’ సక్సెస్… ముగ్గురికీ కీలకమే..!

మరికొన్ని గంటల్లో ‘భైరవం’ (Bhairavam)  ప్రేక్షకుల ముందుకు రానుంది. 2021 లో వచ్చిన ‘అల్లుడు అదుర్స్’ (Alludu Adhurs)  తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) తెలుగులో సినిమా చేయలేదు. మధ్యలో ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చాడు. అది పెద్ద డిజాస్టర్ అయ్యింది. దానికి మినిమమ్ ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఆ తర్వాత వేరే సినిమాలు మొదలుపెట్టాడు. వాటిని కంప్లీట్ చేయకుండా పక్కన పెట్టి.. ఎంతో నమ్మకంతో ‘భైరవం’ చేశాడు. ఈ సినిమాలో శ్రీనివాస్ బాడీ లాంగ్వేజ్, గెటప్ అంతా కొత్తగా ఉంటుంది అని అంటున్నారు.

Bhairavam

ఈ సినిమాతో హిట్టు కొట్టడం శ్రీనివాస్ కు చాలా ముఖ్యం. ఎందుకంటే.. అతని థియేట్రికల్ మార్కెట్ ఇప్పుడు కొంచెం డౌన్లో ఉంది. అలాగే జనాలు కూడా అతన్ని మర్చిపోతున్నారు. సో ఇప్పుడు హిట్టు కొట్టి బాక్సాఫీస్ వద్ద సౌండ్ చేయాల్సిన అవసరం ఉంది.

మరోపక్క ‘ప్రతినిధి 2’ (Prathinidhi 2) తర్వాత నారా రోహిత్ (Nara Rohith) నుండి వచ్చిన సినిమా ఇది. అంతకు ముందు అతను ఆల్మోస్ట్ 5 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ‘ప్రతినిధి 2’ వచ్చినట్టు కూడా చాలా మందికి తెలీదు. ఈ విషయాన్ని నారా రోహిత్ సైతం అంగీకరించాడు. సో అతను కూడా ఓ హిట్టు కొట్టి.. తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇక 7 ఏళ్ళ తర్వాత మంచు మనోజ్ (Manchu Manoj) చేసిన సినిమా ఇది. ఈ సినిమాతో అతను సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఫ్యామిలీ గొడవలతో అతను చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఈ సినిమా హిట్ అయ్యి ఆ ఒత్తిడిని అధిగమించడానికి ఉన్న సువర్ణావకాశం ఇది.

ఇక ఇన్సైడ్ టాక్ ప్రకారం.. సినిమా బాగా వచ్చింది అంటున్నారు. మరి ఈ ముగ్గురు హీరోలకి ఆ పాజిటివిటీ కలిసొచ్చి హిట్టు కొడతారేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus